నేషనల్ క్రష్ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడి అందానికి తెలుగువాళ్లే కాదు, నార్త్ జనాలు కూడా కుళ్ళుకుంటున్నారు. చూడచక్కని అందం, ఆకర్షించే అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో అమ్మడు రైళ్లు పరుగెత్తిస్తుంటుంది. ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో తిష్టవేసింది. చిన్న సినిమాలతో మంచి విజయాలు అందుకున్న రష్మిక ఆ తర్వాత అగ్ర హీరోలతో వరుసగా అవకాశాలను అందుకుంది. ఫలింతంగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది.
ఇకపోతే బాలీవుడ్లో రష్మిక నటించిన ‘గుడ్ బై’ చిత్రం త్వరలో విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లోభాగంగా తెగ సందడి చేస్తుంది. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఇక తెలుగులోకి వచ్చాక రష్మిక రేంజ్ మారింది. నేషనల్ క్రష్గా ఈ అమ్మడికి ఎనలేని గుర్తింపు దక్కింది. అసలు విషయానికొస్తే, గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో తను చేసిన లిప్ లాక్ సీన్లపై తీవ్రమైన నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో తను తీవ్రంగా ఇబ్బంది పడినట్టుగా రష్మిక చెబుతోంది.
సదరు విమర్శల ధాటికి తను రోజుల తరబడి ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నట్టుగా చెప్పింది. రాత్రిళ్లు దిండులో మొహం పెట్టుకుని ఏడ్చేదాన్నంటూ రష్మిక వివరించింది. ఆ ట్రోలింగ్ ప్రభావం తనపై అలా తీవ్రమైన నెగిటివిటీకి కారణమైందని చెప్పింది. నెమ్మదినెమ్మదిగా ఆ ప్రభావం నుంచి బయటపడినట్టుగా రష్మిక వివరించింది. ఇప్పుడు పెద్దగా ట్రోలింగ్ పట్టించుకోవడం లేదని పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టానని అంటుంది రష్మిక. మరి ఈ అమ్మడు రానున్న రోజులలో సెన్సేషన్స్ క్రియేట్ చేయడం ఖాయమని కొందరు అంటున్నా.