హీరోయిన్ ప్రియమణి గురించి విన్నది నిజమేనా?

సౌత్ హీరోయిన్ ప్రియమణి గురించి అందరికీ తెలిసిందే. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఈమె నేషనల్ అవార్డు అందుకున్న టాలెంటెడ్ నటి. ఇక్కడ మొదటగా చెప్పుకోవాలి అంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమా ఈమెకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడ దాదాపు అందరి సీనియర్ హీరోలతో నటించింది. ఆ తరువాత 2017లో ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో ఎవరి కెరీర్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వీటి మధ్య పెద్దగా పొసగడంలేదని టాక్ వినబడుతోంది. అందువల్లనే వీళ్లిద్దరూ విడిపోయి.. వేర్వేరుగా ఉంటున్నారు అని సమాచారం. అలాగే త్వరలో విడాకులు కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు. దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. కాగా రీసెంట్ గా ఓ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా ప్రియమణి షేర్ చేసింది. అందులో ఆమె మాధవన్ రాక్రెట్రీ చిత్రం సక్సెస్ పార్టీలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనపడింది.

ఏ వీడియో చూస్తే వీరు బాగానే వున్నారు కదా అని అనిపిస్తోంది. ఇకపోతే ప్రియ‌మ‌ణి ఒక వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ బిజీగా వుంటున్నారు. భర్త ముస్తఫా రాజ్ విషయానికొస్తే అమెరికాలో ఆయన బిజీగా వున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ప్రియమణి భర్త ముస్తఫా మాజీ భార్య పలు ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే జగపతి బాబు హీరోగా వచ్చిన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో తెలుగువారికి బాగా చేరువయ్యింది ప్రియమణి. ఆ తరువాత తమిళ సినిమా పరుత్తివీరన్‌‌లో ఫీమేల్ లీడ్‌‌గా కార్తీ సరసన నటించి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్న విషయం తెలిసినదే.