బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే మొదట మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది ప్రస్తుతం. RC -15 చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నది.ఇక బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఉన్నది. అయితే ఈ ముద్దుగుమ్మ నటుడు సిద్ధార్థ మలహోత్రా తో ప్రేమలో ఉన్నట్లుగా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరి వివాహానికి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.
2022 జనవరిలో మల్హోత్ర ,కియారా ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఒకే చోట ఉండడంతో ఆ విషయం మరింత వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరి పెళ్లి విషయం మరొకసారి వైరల్ గా మారింది. ఇక వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కాఫీ విత్ కరణ్ -7 లో ఇదే ప్రశ్న అడిగినప్పుడు కియారా జవాబు వేరే లాగా ఉంది. తామిత్తరము కేవలం స్నేహితుల కంటే చాలా ఎక్కువని తెలియజేసింది.
కియారా ,మల్హోత్రా వివాహం ఈ ఏడాది చివర్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదు అంటూ కవ్వింపుగా తెలియజేసింది కియారా. అయితే తాజాగా నిన్నటి రోజు నుంచి వీరిద్దరి మీద ఒక వార్త వైరల్ గా మారుతుంది సిద్ధార్థ, కియారా ఏప్రిల్ 2023 లో వివాహం చేసుకోబోతున్నారని ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట మొదట రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని ఆ తరువాత కాక్ టెయిల్ పార్టీ కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక రిసెప్షన్ కు తమ బంధువులను స్నేహితులను కూడా పిలిచి చాలా గ్రాండ్గా చేయబోతున్నట్లు సమాచారం. అయితే వీరి వివాహం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయం అభిమానుల లో సందేహంగా మిగిలింది.