సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో పుట్టి పెరిగింది. మొదట పలు టీవీ కార్యక్రమాలకు యాంకర్ గా ,అసిస్టెంట్ దర్శకురాలుగా పలు బాధ్యతలను కూడా చేపట్టింది. అలా 15 సంవత్సరాల వయసులో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. గాయనిగా ప్రవేశించి మొదట గులాబీ, ఎగిరే పావురం వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలకు హీరోయిన్లకు వాయిస్ అందించింది. దాదాపుగా 700కు పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారునిగా పనిచేసింది సునీత.
ఇక సునీత జీవిత విషయానికి వస్తే 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే కిరణ్ కుమార్ చేసే వికృత చేష్టలకు ఆమె విసిగిపోయి 2011లో విడాకులు తీసుకున్నది. కిరణ్ ఆమె పైన ఎన్నోసార్లు అనుమానం పడుతూ ఉండేవారట. ఆ కారణంగానే తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవారట. సింగర్ సునీత తన కెరియర్ పిల్లల భవిష్య దృష్టి దృష్టిలో పెట్టుకొని విడాకులు తీసుకోవడమే మంచిదనుకొని అప్పటినుంచి కిరణ్ కుమార్ కు దూరమయింది సునీత.
అయితే ఈమె మొదటి భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ దాదాపుగా వీరిద్దరూ విడిపోయి 11 సంవత్సరాలు కావస్తోంది. ఇక వీరిద్దరికీ పుట్టిన పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం పెద్దవారయ్యారు వీరిద్దరూ విదేశాలలో చదువుకుంటూ ఉన్నారు. అలా చదువుకుంటూనే సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలను అందుకుంటూ ఉన్నారు.
ఇటీవల సింగర్ సునీత మొదటి భర్త ఫోటో చూసినవారు ఒక్కసారి. అయితే కిరణ్ కుమార్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పలు టీవీ ప్రోగ్రామ్లకు కూడా పనిచేస్తూ అవార్డు ఫంక్షన్లకు కూడా డైరెక్టర్ గా పని చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సింగర్ సునీత రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నది.