తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తను నటించిన మొదటి చిత్రం RX -100 సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఇక తన మొదటి చిత్రంతోనే అందచందాలతో బోల్డ్ సన్నివేశాలలో కుర్రకారులను సైతం నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఎన్నో అలాంటి చిత్రాలలో నటించింది. ఇప్పుడు తాజాగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కించిన జిన్నా సినిమా లో నటించింది. డైరెక్టర్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పాయల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది వాటి గురించి తెలుసుకుందాం.
పాయల్ మాట్లాడుతూ… ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని అయితే ఆ తర్వాత తన మేనేజర్ తో పాటు, మరి కొంతమంది తనని తప్పుదారి పట్టించడంతో కథలు వినకుండానే కొన్ని చిత్రాలలో నటించాల్సి వచ్చిందని తెలియజేసింది.కానీ వారు అలా ఎందుకు చేశారో అనే విషయం మాత్రం తనకి ఇంకా అర్థం కాలేదని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత తనకు నచ్చిన కథలోనే నటించేందుకు ఇష్టపడుతున్నానని తెలియజేసింది. ముఖ్యంగా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులకు తప్పకుండా ఆదరిస్తారని అందుకు నిదర్శనం తను నటించిన ఆర్ఎక్స్ 100 చిత్రమే అని తెలియజేసింది.
ఇక కరోనా సమయంలో తమకు బాగా కావాల్సిన వ్యక్తిని కోల్పోయామని తెలిపింది. ఆ సంఘటన తోనే జీవితమంటే ఏంటో నేర్పిందని తెలియజేసింది పాయల్. ఇక ప్రస్తుతం కన్నడ తో పాటు తమిళంలో కూడా ఒక చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం పాయల్ నటించిన జిన్నా చిత్రం తన కెరీర్ ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.