రెచ్చిపోయిన రాధిక ఆప్టే.. ఏం చేసిందో చూడండి..!!

బాలీవుడ్ అందాల భామ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ముందు తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరియర్‌ను మొదలుపెట్టింది. ఇక్కడ ఆమె చేసిన‌ సినిమాలు హిట్ అయినా ఆఫర్లు సరిగా రాకపోవడంతో. బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయింది. అక్కడ ఈమె చేసిన సినిమాలు వెబ్ సిరీస్‌లు సూపర్ హిట్ అవడంతో మంచి పేరు తెచ్చుకుని స్టార్ హీరోన్‌గా కొనసాగుతుంది.

రాధిక ఆప్టే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనదైన స్టైల్‌లో పోస్ట్‌లు పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. రాధిక ఆప్టే కొన్నాళ్లపాటు సినిమాలుకు దూరంగా ఉంది. తాజాగా సినిమా విక్రమ్ వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నిన్న విడుదల అయింది. ఈవెంట్‌లో రాధిక ఆప్టే ఒక డిజైనర్ లుక్ లో రెబల్ క్వీన్ గా కనిపించింది. ఈలుక్‌లో ఆమెను చూసిన ప్రేక్షకులు అభిమానులు సైతం మంత్ర ముగ్ధులు అయిపోయారు. ఈవెంట్‌లో నల్లని డ్రెస్సులో మ్యాచింగ్ ప్యాంట్ వేసుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం కోసం హృతిక్ రోషన్ తదితర నటులు ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లోని రాధిక ఆప్టే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.