వైరల్ అవుతోన్న మంచు లక్ష్మి స్నానం చేస్తున్న వీడియో… బెదిరిపోతున్న నెటిజెన్స్!

ఈమధ్య కాలంలో మంచు ఫ్యామిలీ ఏం చేసినా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోతోంది. తరచూ మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణులు నెటిజన్స్ ట్రోల్స్ కి గురవుతూ వున్నారు. ముఖ్యంగా సొంత డప్పు కొట్టుకుంటారనే అపవాదు ఈ ఫ్యామిలీపై గట్టిగా పడిపోయింది. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ తో కూడిన తెలుగు మాటలను విపరీతంగా ట్రోల్ చేస్తారు నెట్టింటి జనం. ఈ క్రమంలో కేవలం మంచు కుటుంబాన్ని ట్రోల్ చేయడానికే క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో పుట్టుకొచ్చాయి ఈ మధ్య కాలంలో. మంచువారి చర్యలు, మాటలు ట్రోలర్స్ కి అవసరమైన మెటీరియల్ దండిగా ఇస్తాయి.

ఇకపోతే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో ఆమె తరచుగా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. అలాగే ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ లో తన పర్సనల్ వీడియోలు అప్లోడ్ చేస్తారు. ఆ మధ్య మంచు లక్ష్మి ఉత్తర భారతం వెళ్లారు. అక్కడ ఉన్న పుణ్య క్షేత్రాలు సందర్శించారు. ఈ క్రమంలో గంగానదిలో స్నానం చేస్తున్న వీడియో మంచు లక్ష్మి షేర్ చేశారు. నీళ్లు చల్లగా ఉండటంతో ఆమె నదిలో నిండా మునగడానికి భయపడ్డారు. దాంతో ఓ మగ్ తీసుకొని ఒడ్డున కూర్చుని స్నానం చేశారు.

ఇక ఈ వీడియోలో మంచు లక్ష్మి స్నానం చేయడంతో పాటు గంగానదిని తన ఆడియన్స్ కి చూపించింది. కాగా ఈ వీడియో సైతం ట్రోల్స్ కి గురైంది. స్నానం చేస్తున్న వీడియో కూడా షేర్ చేయాలా? చేస్తే చేశావ్… ఆ ఓవర్ యాక్షన్ ఏంటంటూ మండి పడుతున్నారు నెట్టింటి జనాలు. అయితే ఈ ట్రోల్స్ ని మంచు లక్ష్మి అసలు పట్టించుకోరు. పని లేని వాళ్ళు చేసే విమర్శలు పట్టించుకోను అంటారు. పలు ఇంటర్వ్యూల్లో ఆమె ఇదే చెప్పడం గమనార్హం.