టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వీరిద్దరి కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా రిలీజ్ ముందు ఎంత భారీ హైప్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా రెండో రోజు నుంచే దుకాణం సర్దేసుకుంది. పూరి జగన్నాథ్ చెత్త సినిమాలలో ఒక సినిమాగా లైగర్ సినిమా మిగిలిపోయింది.
అయితే ఈ సినిమాని భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్ లో వారు డబ్బులు రాక లబో దిబో అంటున్నారు. సినిమా ఆఫ్టర్ ప్లాప్ అవడంతో. వారు పెట్టిన డబ్బులు కూడా రాలేదట. ఇక దీంతో ఈ సినిమా మెయిన్ ప్రొడ్యూసర్ అయిన ఛార్మినే మా నష్టాలు బర్తి చేయమని అడుగుతున్నారట.ఐతే ఛార్మి మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడం లేదు అన్నట్టు సమాచారం. ‘మీరేం చేసుకుంటారు చేసుకోండి నేను మాత్రం డబ్బులు ఇవ్వనని చేతులెత్తేసిందిఅటస. వారికి జీఎస్టీ తిరిగి ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకోంది అట . అంతే కారు చార్మి… ‘మాట్లాడుతు మీరే కాదు లైగర్ సినిమా వాళ్ళ మేం కూడా నష్టపోయాం మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి నా డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారంటూ తిరిగి డిస్ట్రిబ్యూటర్లను ఎదురు ప్రశ్నిస్తుందట. అంతే కాదు చార్మి వారితో వాగ్వాదానికి దిగిందట.
డిస్ట్రిబ్యూటర్ అందరూ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలంటు తలపిక్కుంటున్నారు. ఆచార్య సినిమా టైపులో లైగర్ సుమస్యను పరిష్కరించుకోవాలని కొంతమంది ఆలోచనకు వస్తున్నారు. ఈక్రమంలో పూరి జగన్నాథ్ ఛార్మి ఇల్లముందు ధర్నా చేద్దామని కొంతమంది అంటున్నరు. ఆచార్య సినిమా ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవదు. పూరి- ఛార్మి అసలు మనకు దొరకరు. ఏం చేయాలో అర్థం కాక ఈ సమస్యను ఫిలిం ఛాంబర్ కు చేర్చాలని వారు భావిస్తున్నారట. చూడాలి వీరి నష్టలు ఎవరు తీరుస్తారో..?