బాహుబలి సినిమాలతో రాజమౌళి సౌత్ ఇండియన్ సినిమా లెవెల్ మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. దీంతోపాటు సౌత్ నుండి కేజిఎఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ సౌత్ ఇండియా సినిమాలను మరో మెట్టెక్కించాడు. బాహుబలి, బాహుబలి 2, కేజీయఫ్, కేజీయఫ్ 2 సినిమాలతో ఇప్పుడు దేశం అంతా సౌత్ సినిమా వైపు చూస్తోంది. తాజాగా కే జి ఎఫ్ సినిమాపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నార్త్ ఇండియాలో ఒక వ్యక్తి కే జి ఎఫ్ సినిమా చూసి ఆ సినిమాలో నటించిన హీరోలాఅవ్వాలని హత్యలు చేయడం మొదలుపెట్టాడట. అతను మధ్యప్రదేశ్ కు చెందిన ఆ వ్యక్తి ఇప్పటివరకు ఐదుగురు సెక్యూరిటీ గార్డులను హత్య చేశాడట. ఇలా వరుసగా హత్యలు చేసుకుంటూ కేజీయఫ్ సినిమాలో లాగా రాఖీ బాయ్ లాగా అవ్వాలని కేజీఎఫ్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారట.
అయితే ఎంత హంతకుడు అయినా చిన్న తప్పుతో దొరికిపోక తప్పదు. ఈ సీన్లో కూడా అదే ట్విస్ట్ జరిగింది. తాజాగా అతడు హత్యలు చేసిన సెక్యూరిటీ గార్డుల ఫోన్లు తీసుకుని… వాటిని వాడటంతో ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు అతడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. పోలీసులు అతడు చెప్పిన సమాధానంతో అశ్చర్యానికి గురయ్యారు. ఆ వ్యక్తి ముందుగా సెక్యూరిటీ గార్డులను తర్వాత పోలీసులను హత్యలు చేసుకుంటు తన రేంజ్ పెంచుకునే ప్లాన్ వేశాడట.