బాలీవుడ్ అందాల భామ కత్రిన కైఫ్ గురించి ప్రతేక్యంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కోనసాగుతుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించి మెప్పించింది. ఈమె తెలుగులో కూడా నటిచింది. వేంకటేష్తో మల్లిశ్వేరి సినిమాలో నటించి అలరించింది. బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలో నటించి మెప్పించింది. కత్రిన మంచి ఫామ్లో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ తోప్రేమలో ఉన్నటు వార్తలు బయటకువచ్చాయి. దీంతో అమె కెరియర్ స్లో అయ్యింది.
తర్వాత కోంత కాలం సినిమాలకు దురంగా ఉంది. మళ్లీ సినిమాలకు ఎంట్రి ఇచ్చి తన క్రేజ్ పెంచుకుంది. కత్రిన యంగ్ హీరో విక్కి కౌశల్తో ప్రేమలో పడింది. మూడు సంవత్సరాలు పాటు సహజీవనం చేసి గతఏడాది డిసింబర్లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి కి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్లి చాల గోప్యంగా జరిగింది. పెళ్లయిన తర్వాత సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను కత్రినా షేర్ చేసింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని అభిమానులకు తెలిపింది.
తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డులు కార్యక్రమానికి భర్త విక్కీ కౌశల్ తో కలిసి కత్రినా హాజరైంది ఇక ఈ కార్యక్రమంలో కత్రినా మాట్లాడుతూ..తమ పెళ్లి రహస్యంగా జరగడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది.”మేము మా పెళ్లి నీ చాలా గోప్యంగా ఉంచడానికి ముఖ్యమైన కారణం కోవిడ్. ఆ పరిస్థితుల వల్ల అలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబ సభ్యుల్లో చాలామందికి కరోనా వల్ల ఇబ్బంది పడ్డాము. మా పెళ్లి వల్ల మిగిలిన వారు కూడా ఇబ్బంది పడతారని చాలా గోప్యంగా జరుపుకున్నామని కత్రినా వెల్లడించింది. మేము చాలా సంతోషంగా ఫీలయ్యామనిమని చెప్పింది.
కత్రినాఇప్పుడు బాలీవుడ్లో చాలా బిజీగా ఉంది సల్మాన్ ఖాన్ తో టైగర్ 3 సినిమాలో నటిస్తుంది. అలాగే సిద్ధార్థ చతుర్వేది కిషాన్ ఖట్టర్తో కలిసి ఫోన్ బూత్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వీటితోపాటు సౌత్ లో తమిళ్ నటుడు విజయ్ సేతుపతి తో కూడా ఈమె నటిస్తుంది. కత్రినా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.