ఓ మై గాడ్: జాక్ పాట్ కొట్టిన అనుపమ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..ఇక పిచ్చెక్కిపోవాల్సిందే..!!

అబ్బా ఏం న్యూస్ రా స్వామి.. ఇది కథ కావాల్సిందే. అనుపమ పరమేశ్వరన్ పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ దక్కించుకునేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశం తగ్గించుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అనుపమ పరమేశ్వరన్ అభిమానులు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే అనుపమ పరమేశ్వరన్ చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది . చూడడానికి చక్కగా తెలుగింటి అమ్మాయిల ఉంటుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో వచ్చిన అ ఆ సినిమాతో సెకండ్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత తనదైన స్టైల్ సినిమాలు చేసుకుంటూ హిట్లు ఫ్లాప్ ల తో సంబంధం లేకుండా లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళింది. సినిమా హిట్ అయిన ఫ్లాప్ పైన అనుపమ నటనతో మాత్రం మెప్పించింది . అందుకే అనుపమకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.

కాగా ఈమధ్యనే కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అనుపమ.. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో ఆమె విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది . అంతేకాదు ఈ సినిమా పుణ్యమా అంటూ ఆమెకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయట . కాగా ప్రస్తుతం ఆమె నిఖిల్ తో నటిస్తున్న “18 పేజెస్” అనే సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది . దీంతోపాటు “బటర్ ఫ్లై ” అనే చిత్రంలో కూడా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా అనుపమకు మూడు క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశం దక్కినట్లు సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి.

దాంతో మొదటిగా ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో అనుపమ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట. అంతేకాదు ప్రభాస్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాలోని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం .ఇదే కాకుండా మరో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమాలోను అనుపమ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఇలా వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేయడం అనుపమ కెరియర్ లోనే ఫస్ట్ టైం . ఈ ఒక్క న్యూస్ చాలదు అనుపమ అభిమానులను పిచ్చెక్కిపోయి ఆనందించడానికి అంటున్నారు జనాలు.