సినీ ఇండస్ట్రీలో ఎప్పుడ.. ఎవరు.. ఎలా..ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం. కానీ అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొన్న వారు.. తాము కష్టాలను విపరీతంగా ఎదుర్కొంటున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని కొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకుంటే.. మరి కొంత మంది ధైర్యంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ తామేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ నటి వీ.ఎస్.రూపా లక్ష్మీ కూడా ఒకరు. ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన రూపా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు..
ఇక ఆమె మాట్లాడుతూ .. చిరంజీవి గారు ఒక కార్యక్రమంలో బలంగా అనుకుంటే అనుకునేది కచ్చితంగా సాధించగలమని చెప్పారు. ఇక నేను కూడా అదే ఫాలో అయ్యాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్రదర్ ఫ్రెండ్ ఒక ఛాన్స్ విషయంలో హెల్ప్ చేశారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఎన్నో అవమానాలను తట్టుకున్నాను అంటూ ఆమె వెల్లడించింది. ఇకపోతే సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ చెప్పిన తర్వాత దానిని మార్చితే నేను నో చొప్పున సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక నేను ఫేస్ చేసిన సందర్భంలో ఆ సమస్య కొత్తగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది మారుతుందో చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి చాలా బాగుంది అంటూ ఆమె తెలిపింది.కెరియర్ తొలినాల్లలో చిన్న చిన్న పాత్రలకు ఎక్కువగా అంగీకరించాను. కానీ మంచి ప్రాజెక్టు వచ్చి చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఒక సినిమా సెట్ కి వెళ్ళిన తర్వాత వద్దని చెప్పడంతో నాకు బాధగా అనిపించేది. ఇక ఆ విధంగా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను.. ఇక వాటిని భరించలేక వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అప్పుడే మనసును దృఢపరుచుకొని.. ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇప్పుడు అలాంటి భావన లేదు సుమారుగా 12 సంవత్సరాలవుతుంది.. పెద్దపెద్ద ఆర్టిస్టులతో పనిచేస్తున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అంటూ అని తెలిపింది. సృష్టి అనే నాటిక తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని కూడా తెలిపింది రూపా లక్ష్మి.