ఆ సీఎంకు రుణపడి ఉంటా నంటున్న హీరోయిన్ వాణిశ్రీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్, నటి వాణిశ్రీ ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటనను ప్రదర్శించింది. ఈమె ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. అయితే వాణిశ్రీ కి సంబంధించి ఒక ప్రాపర్టీ చెన్నై నగరంలో ఉన్నది. చూలమేడు ప్రాంతంలో ఉన్న ఈ స్థలం కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. అప్పట్లో రబ్బర్ ఫ్యాక్టరీని నడిపిన ఆ తర్వాత ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొంతమంది ఈ స్థలాన్ని కాజేయాలని చూశారట. ఇక కొంతమంది నకిలీ పత్రాలను సృష్టించి నటి వాణిశ్రీ కి చెందిన రూ. 20 కోట్లు విలువైన స్థలాన్ని కబ్జా చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Time Changes Beauty: Beautiful Telugu Actresses Then and Now
దాదాపు కొన్ని సంవత్సరాలపాటు పోరాడిన ఈ స్థలం వివాదం మాత్రం ఇంకా ముగిస లేదట.. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నటి వాణిశ్రీ కి చెందిన రూ. 20 కోట్ల విలువైన స్థలాన్ని ఆమెకు దక్కించేలా చేశారట.చెన్నై మహానగరంలో ఉన్న ఈ ఖరీదైన స్థలాన్ని కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ తో కబ్జా చేయడానికి అరికట్టడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.

TN CM Stalin Shifts Tamil Nadu Day To July 18 From Nov 1. Know Why
ఇందులో భాగంగా నగరంలో ఎక్కడెక్కడ భూవివాదాలు ఉన్నాయో గుర్తించి అలాంటి సమస్యలను సంబంధించి డాక్యుమెంట్స్, ఒరిజినల్వా లేక నకిలీవా అని గుర్తించి ఆ స్థలాన్ని ఆ యజమానికి అందించాలనే నిర్ణయాన్ని అధికారులకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా నటి వాణిశ్రీ రూ. 20 కోట్లు విలువైన స్థలాన్ని గుర్తించి వాణిశ్రీ కి చెందిచెలా సెక్రటేరియట్ లో మాట్లాడి వాణిశ్రీ చేతికి స్థలం డాక్యుమెంట్స్ ను అందజేసేలా చేశారట సీఎం స్టాలిన్. దీంతో తన స్థలాన్ని తనకు ఇప్పించిన సీఎం స్టాలిన్ ఎంతో రుణపడి ఉంటారని వాణిశ్రీ తన ఆనందాన్ని తెలియజేస్తుంది.