వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఎస్తేర్ అనిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం మాత్రుక అయిన ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం అలాగే హిందీలో కూడా డబ్బింగ్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకనిర్మాతలు. ఇకపోతే ఈ సినిమా రెండో భాగం కూడా బాగా హిట్ అయింది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఎస్తేరు అనిల్ దృశ్యం టూ సినిమాలో నటించేటప్పటికీ హీరోయిన్గా అవతారం ఎత్తింది. ఇక మలయాళం సినిమాలో నటించిన ఈమె తెలుగు దృశ్యం సినిమాలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్గా సినిమాలలో నటించాలని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది.
ఇకపోతే హీరోయిన్ గా సినిమాలలో నటించాలని అగ్రతారగా కొనసాగాలి అని చాలామంది అమ్మాయిలు కలలు కంటున్న విషయం తెలిసిందే. ఇక ఆ కలలను సహకారం చేసుకోవడానికి వారు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కానీ ఎస్తేరు మాత్రం తన లైఫ్ ను రిస్క్ లో పెట్టే పనులు చేస్తోందంటూ నేటిజెన్లు సైతం నోరెళ్ళ పెడుతున్నారు. ఈమె తన గ్లామర్ పెంచుకోవడం కోసం సర్జరీలను ఆశ్రయించిందట..అంతేకాదు ఇప్పటికే అందాన్ని తీర్చిదిద్దుకోవడానికి పలు సర్జరీలు చేయించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చర్మం నిగనిగలాడడానికి ఏవో మెడిసిన్స్ కూడా వాడుతున్నట్లు సమాచారం. ఇంత చిన్న వయసులోనే ఇలాంటివన్నీ చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది.. కనీసం జ్ఞానం లేకుండా ఇలా సినిమా అవకాశాల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతుందా అంటూ ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఎస్తేరు అనిల్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండకూడదు అంటే కూడా నెటిజెన్లు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే సినిమా అవకాశాల కోసం ఇలాంటి పనులు చేస్తోంది ఏంటి అంటూ కూడా ఈమెను ట్రోల్ చేస్తున్నారు.