బింబిసారా.. కార్తికేయ-2 చిత్రాలు ఓటిటిలో రిలీజ్ డేట్ లాక్..!!

యువ హీరో సిద్ధార్థ నిఖిల్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ -2 ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా హీరో కెరియర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది అని చెప్పవచ్చు దీంతో ఏకంగా ఈ సినిమా దాదాపుగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాని ఓటీటి లో చూసేందుకు ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా దసరా కానుకగా ఓటీలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాని అక్టోబర్ 5వ తేదీన zee -5 లో స్ట్రిమింగ్ చేయనున్నారు అందుకు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఇక కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హీట్ గా నిలిచిన చిత్రం బింబిసారా. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ బ్యానర్ పైనే నిర్మించడం జరిగింది. ఈ సినిమా కూడా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం కూడా కొన్ని కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది. సినీ ప్రేక్షకులలో సైతం ఓటిటి లో ఎప్పుడేప్పుడు ప్రసారమవుతుందా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పుడు మరింత ఉత్సాహాన్ని కలిగించేందుకు ఈ సినిమానీ అక్టోబర్ 7వ తేదీన zee -5 లో స్ట్రిమ్మింగ్ చేయనున్నారు.

ఇక వచ్చే వారంలో ఈ రెండు సినిమాలు కేవలం ఒక్క రోజు వ్యవధిలోని ఓటీటి లో విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని జి5 సంస్థ అధికారికంగా తన ట్విట్టర్ నుంచి తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

https://twitter.com/PulagamOfficial/status/1574569691216982016?s=20&t=lZ-7H6N0KKEiQbSfXOH8Ow