తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ మొదట ఐరన్ లెగ్గుగా పేర్కొంది.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక శృతిహాసన్ చేసే పనులు అప్పుడప్పుడు చాలా సరదాగా కూడా అనిపిస్తూ ఉంటాయి. అలా ఒకసారి వెండితెర పైన ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయంలో సడన్గా నటీనటులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. దీంతో అభిమానులకు చెప్పలేని అనుభూతి అని చెప్పవచ్చు. అలాంటి అనుభవమే పొందింది హీరోయిన్ శృతిహాసన్. హీరో ధనుష్, శృతిహాసన్ కలిసి నటించిన 3(త్రి) సినిమాని చూస్తున్న కొంతమంది ప్రేక్షకులకు షాక్ ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
శృతిహాసన్, ధనుష్ జంటగా నటించిన త్రీ చిత్రం విడుదలై ఇప్పటికి 10 సంవత్సరాలు పైన కావస్తోంది దీంతో ఈ సినిమాని రీ రిలీజ్ లో భాగంగా నిర్మాత నటి కుమార్ తన పుట్టినరోజును పురస్కరించేందుకు ఈ సినిమాని గురువారం రోజున విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న నగరంలో ఎంబి మల్టీప్లెక్స్ లోకి శృతిహాసన్ సడన్గా ఎంట్రీ ఇచ్చి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అప్పటివరకు తెరపై కనిపిస్తున్న ఆమె ప్రేక్షకుల ముందు రావడం తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక వెంటనే అక్కడను ప్రేక్షకులు తేరుకొని నానా హంగామా చేశారు. ఇక వారు చేసిన సందడి కి శృతిహాసన్ కూడా ఫిదా అయిపోయింది.
అలా ఆ సినిమాలోని ఒక హిట్ సాంగ్.. కన్నులదా అనే పాటను కూడా పాడి అలరించింది. ఈ సందడి గురువారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించింది ఈ చిత్రం 2012లో విడుదలై అటు కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా ఆశించినంతగా సక్సెస్ కాలేక పోయింది. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చిత్రానికి క్రేజీ రావడం విశేషం అని చెప్పవచ్చు. ప్రస్తుతం శృతిహాసన్ కి సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram