మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమి తెలుగు నుండి తమిళ్ ఇండస్ట్రీ వరకు అందరితో నటించింది. 2014లో ఈ ముద్దుగుమ్మ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ రెండు సంవత్సరాలు పాటు కలిసి జీవించారు. అనుకోని కారణాలు వల్ల 2016 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు విడాకులు తీసుకున్న టైంలో ఆమలాపాల్ తన బిహేవియర్తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈమె కొంత కాలం పాటు సినిమాలు తీయకుండా ఖాళీగానే ఉంది.భర్తతో విడాకులు తీసుకున్న అమలాపాల్ గత కొంతకాలంగా సినిమాలపై బాగా కాన్సెంట్రేట్ చేసి బిజీ హీరోయిన్గా మారింది.
ఇదే క్రమంలో నిర్మాతగా మారి తన సొంత బ్యానర్లో తను నటించి ఒక సినిమాను నిర్మించింది. ఆ సినిమా తాజాగా విడుదలవి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా అమలాపాల్ సోషల్ మీడియాలో బాగా రచ్చ చేసింది. ఆ టైంలోనే బవేందర్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీస్ కేసు కూడా పెట్టింది.
పోలీసులు అతనిని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతను బెయిల్ కోసం తిరువల్లూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతని పిటిషన్ విచారించిన కొర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే అమలాపాల్ అతను 2019లో వివాహం చేసుకున్నాడట. ఆమె నాపై కావాలనే కేసు పెట్టిందని నన్ను మోసం చేసి డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి చూస్తుందని అతను ఆరోపించాడు. ఈ క్రమంలోనే అమలాపాల్ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి దీనిపై నటిజన్స్ కామెంట్స్ చేస్తూ అమ్మదొంగ చేసిన పనంత చేసి పతివ్రతలా మాట్లాడుతున్నావే అంటూ ట్రోల్ చేస్తున్నారు