నందమూరి కుటుంబంలో ఇటీవలే ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒక్కసారిగా సినీవర్గాల నుండి సాధారణ ప్రజల వరకు అందరూ కూడా షాక్ అయ్యారు. ఆస్తి హోదా అన్నీ ఉండి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అభిమానులలో. ఇక ఎన్టీ రామారావు గారి మరణం నుండి ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వరకు ప్రతి సంఘటన గురించి తెలియజేశారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు. వాటి గురించి తెలుసుకుందాం.
ఎన్టీఆర్ గారు మరణించడానికి కొద్ది సమయం ముందు ఆయన నాగేశ్వరరావు గారితో మాట్లాడారని ఆయనను కలవాలని అడగక ఆయన ఉదయం మాట్లాడదామని తెలిపారుట. అయితే ఆ రాత్రి హరికృష్ణ ఇంటికి వెళ్లాలనుకున్నారు అలా వెళ్లి ఉన్న వేరే లాగా ఉండేది కానీ అలా జరగలేదు.. ఆయన చనిపోక మూడు గంటల ముందు చాలా కీలకంగా ఉన్నది అంటూ ఇమ్మంది గారు తెలియజేశారు. ఇక ఆయన చనిపోయేటప్పుడు పోస్టుమార్టర్ చాలా అనుమానాస్పంద స్థితిగా ఉన్నదని డాక్టర్ కుసుమ చెప్పారని తెలిపారు.
ఇక ఆయన ముఖం అంతా నీలిరంగుగా మారిపోయింది అని ఏవైనా మాదకద్రవ్యాలు లేక స్లో పాయిజన్ వంటివి ఆయన మీద ప్రయోగించి ఉంటేనే ఇలాంటివి జరుగుతుందని తెలియజేసారట. కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మరణానికి సంబంధించిన ఇలాంటి విషయాలు బయటకు వస్తే పరువు ఏమవుతుందంటూ వాటిని దాచి పెట్టారట. అలా కాకుండా ఆరోజు నిజాలు బయటికి వచ్చి ఉంటే కొంతమంది బతుకులు చాలా బయటకి వచ్చేవి అని ఇమ్మంది తెలిపారు ఇలాంటి నిజాలు ఇప్పుడు మాట్లాడడానికి నేను ఏమి భయపడను అని కూడా తెలియజేశారు. ఇక అంతే కాకుండా నందమూరి ఇంటికి ఏదో ఒక శాపం ఉందని కూడా తెలియజేస్తున్నారు ఆయన.