అనసూయ, రష్మీలకు బిగ్ షాక్..శ్రీముఖీ సంచలన నిర్ణయం..!?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నా రష్మీ, అనసూయ, శ్రీముఖి ఈ ముగ్గురు మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే . మిగతా యాంకర్ లు అందరు యాంకరింగ్ వైపు కాన్ సెన్ట్రేషన్ చేస్తే..వీళ్లు ఎక్స్ పోజింగ్ వైపు కూడా చేస్తారు అంటూ జనాలు చెప్పుకుంటుంటారు. ఈ ముగ్గురు యాంకర్లు ఆరబోసినంత అందాలు ఏ యాంకర్ కూడా ఆరబోయలేదు అనే చెప్పాలి. యాంకర్ గా సుమ ఎంత మంచి స్థానాన్ని సంపాదించుకుందో తెలిసిందే. నో ఎక్స్పోజింగ్, నో వల్గారిటి.. నో హర్టింగ్.. ఈ మూడు నే ఆమె ప్రధానంగా తీసుకొని యాంకరింగ్ చేస్తూ సహజ సిద్ధమైన యాంకరింగ్ స్టైల్ తో అభిమానులను సంపాదించుకుంది .

 

అదేవిధంగా ఆవిడని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మీ, అనసూయ, శ్రీముఖి మాత్రం గ్లామర్ ని మెయిన్ ఇంపార్టెంట్ గా చేసుకున్నారు. అఫ్ కోర్స్ యాంకర్లకి అది కూడా ముఖ్యమే.. ఈ ముగ్గరికి అది కూసింత ఎక్కువే ఉందని అంటున్నారు ఫ్యాన్స్. వీళ్ళ ముగ్గురిలో కంపేర్ చేస్తే శ్రీముఖీ చిన్నది. ఇప్పుడు ఈ చిన్న పిల్లే నే వీళ్ళ ఇద్దరికి బిగ్ షాక్ ఇచ్చింది. దాదాపు 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న సాధించలేనిది..శ్రీముఖీ సాధించింది. ఇంతకీ శ్రీముఖి సాధించిన అంత గొప్ప రికార్డ్ ఏంటో తెలుసా..?

ఓ డాన్స్ షో కి జడ్జ్ గా మారింది . అది కూడా స్టార్ యాంకర్ ఓంకార్ షో కి. దీంతో ఇప్పుడు బుల్లితెర కళ్లని శ్రీముఖి పైన పడ్డాయి. ఇంత చిన్న ఏజ్ లోనే జడ్జిగా మారడం శ్రీముఖి సాధించిన ఓ రికార్డు అనే చెప్పాలి .దీంతో శ్రీముఖికి నెట్టింట శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. శ్రీముఖి డాన్స్ ఐకాన్ కి జడ్జిగా వ్యవహరిస్తుంది . దీనికి ఓంకార్ యాంకర్ గా చేస్తుండటం మరో బిగ్ షాకింగ్ అంటున్నారు విశ్లేషకులు. అంటే ఇప్పుడు శ్రీముఖి దర్జాగా కూర్చొని ఉంటే ఓంకార్ స్టాండింగ్ పొజిషన్ లో శ్రీముఖి ని రివ్యూ అడగడం.

అబ్బో చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటున్నారు శ్రీముఖి అభిమానులు. యాంకర్లు జడ్జిలుగా మారడం చాలా అరుదు. అది ఇంత చిన్న ఏజ్ లో మారడం శ్రీముఖి కే దక్కిందని చెప్పాలి. శ్రీముఖి ఇంత చిన్న వయసుకే జడ్జిగా మారినందుకు ప్రముఖుల ఆమెని అప్రిషియేట్ చేస్తున్నారు. మరోపక్క అనసూయ, రష్మీ లను బీట్ చేయడం శ్రీముఖి కే సాధ్యం అంటూ శ్రీముఖి అభిమానులు ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అనసూయ కూడా జఢీగా చేసింది..కానీ ఆ షోలకి యం యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసాడు. కానీ ఇక్కడ స్టార్ యాంకర్ ఓంకార్..హోస్ట్. దీంతో శ్రీముఖీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.