షాక్ .. ఛార్మీ తో బంధం పై నోరు విప్పిన పూరీ జగన్నాథ్..!!

ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రముఖ హీరోయిన్ ఛార్మీ కౌర్ ల మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పటినుండో పలు రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి ప్రేక్షకులు, మీడియా వారు సైతం వీరి మధ్య ఏదో ఉందని రూమర్స్ బాగా స్ప్రెడ్ చేశారు. ఒకవైపు ఛార్మికి వివాహం కాలేదు.. మరొకవైపు పూరీ జగన్నాథ్ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులోనూ కొడుకు ఇప్పుడు హీరోగా కూడా మారి విజయ బాటలో దూసుకుపోతున్నాడు. అయితే ఇలాంటి వార్తలపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు నోరు విప్పి అందరికీ షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు..Puri Jagannadh Takes Charmi Help - Telugu Bulletప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ తో తెరకేక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో చార్మీ కి పూరీ జగన్నాథ్ ఐ లవ్ యు చెప్పడం అంతా సంచలనంగా మారింది. ఇక తనకు ఛార్మీ ఎంత సపోర్టింగ్ గా ఉంటుందో చెబుతూ ఇలా ఐ లవ్ యు అంటూ చెప్పాడు పూరీ.. ఇలా అనడం తో వీరిపై వస్తున్న రూమర్స్ ను మరింత పెద్దది చేసిందని చెప్పాలి ఈ వార్త. ఇక ఇలా వస్తున్న వార్తలపై పూరీ జగన్నాథ్ మొదటిసారి స్పందించాడు. ఇక ఇన్ని సంవత్సరాలు నుండి ఈ రూమర్స్ పై స్పందించని వారు సడన్గా స్పందించడం కూడా అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అనుకుంటున్నారు ప్రేక్షకులు.. పూరీ మాట్లాడుతూ తను ఒక 50 ఏళ్ల మహిళ అయితే ప్రేక్షకులు ఈ విషయాల గురించి పట్టించుకోరు..Wagging tongues can't be stopped: Charmi Kaur

వేరే వారితో పెళ్లి జరిగి ఉంటే కూడా పట్టించుకోరు. చార్మి ఇంకా యంగ్ గా ఉండడం వల్ల ప్రేక్షకులు అనుకుంటున్నారు.. ఒకవేళ ఎఫైర్ ఉన్నా కూడా ఎన్ని రోజులు ఉంటుంది.. ఏ జంటకైనా రొమాంటిక్ యాంగిల్ కు వచ్చేసరికి ఆకర్షణ అనేది కొద్ది రోజుల్లోనే చచ్చిపోతుంది.. అందరికీ పెళ్లయింది..అందరికీ ఈ విషయం తెలుసు.. ఫ్రెండ్షిప్ మాత్రమే శాశ్వతం.. ఛార్మీ 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు.. దాదాపు రెండు దశాబ్దాలుగా తనతో నేను కలిసి పనిచేస్తున్నాను. ఆమె నాకు మంచి స్నేహితురాలు.. ఎటువంటి తప్పుడు సంబంధం లేదు అంటూ రూమర్స్ కి చెక్ పెట్టారు పూరీ జగన్నాథ్.