మాట తప్పిన మహానటి..చెత్త పనితో పరువు తీసుకున్న కీర్తి సురేష్..!?

సినీ ఇండస్ట్రీలో మాట మీద నిలబడే హీరోయిన్లు చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో కీర్తి సురేష్ ఒకరు అంటూ గర్వంగా చెప్పుకునే వాళ్ళు కీర్తి అభిమానులు . కానీ సర్కారీ వారి పాట సినిమా నుండి ఆ మాటను తప్పు అంటూ తన పరువు తానే తీసుకునేలా చేసుకుంది కీర్తి సురేష్. సర్కారు వారి పాట సినిమా ముందు వరకు నటించడానికి కొన్ని హద్దులు అంటూ పెట్టుకుని ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా చూసుకున్నింది కీర్తి పాప .కానీ ఏమనుకున్నిందో ఏమో మహేష్ బాబు సినిమా నుంచి ఆ లిమిట్స్ ని క్రాస్ చేస్తూ..నాభి అందాలను ,బ్యాక్ అందాలను ,ఎదభాగాలను మొత్తంగా చూపిస్తూ.. హాట్ ఫోటోషూట్లతో తన పరువు తానే తీసుకుంటుంది .

ఇలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్లు చేస్తున్నందుకు కీర్తి సురేష్ పై జనాలు హ్యూజ్  ట్రోలింగ్ చేస్తున్నారు .ఈ క్రమంలోనే అమ్మడు మాట్లాడిన ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కెరియర్ స్టార్టింగ్ లో కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తాను ఎక్స్పోజింగ్ ఎందుకు చేయడం లేదో వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..” మా అమ్మ చెప్పింది. మనం ఓ పని చేస్తే అది మన తరతరాలు గుర్తు పెట్టుకుంటారు . అది మంచిగానే గుర్తు పెట్టుకోవాలి.

అందుకే నేను ఎక్స్పోజింగ్ చేయట్లేదు .ఇప్పుడు నేను చేసే సినిమాలు రేపటి తరం నా బిడ్డలు ..నా మనవరాలు చూస్తారు. ఆ టైంలో నన్ను నేను వాళ్ళ దగ్గర తక్కువగా చేసుకోలేను. వాళ్ళు నన్ను తక్కువగా చూస్తే భరించలేను . నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అవి నేను క్రాస్ చేయదలచుకోవట్లేదు. మా అమ్మ నాకు నేర్పించిన పాఠం ఇదే ” అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే వీడియోని జనాలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ” అప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంటి ..ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎంటి కీర్తి” అంటూ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు .మరి దీనికి సమాధానం కీర్తి సురేష్ చెప్తుంది అంటారా..? వేచి చూడాల్సిందే..!!