అప్పట్లో మా ఎన్నికలు టాలీవుడ్ లో పెను సంచలనంగా మారాయి. మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీపడిన ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. వీరిద్దరూ వల్ల ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది అని టాక్ వినిపించింది. మెగాస్టార్ చిరంజీవి మద్దతు మాకుంది అంటే మాకు ఉంది అంటూ ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ఇద్దరూ కూడా గొడవ పడడం మనం చూసాము. అయితే చివరికి స్థానికేతరుడు కావడంతో ప్రకాష్ రాజు పై వ్యతిరేకత పెరిగిపోవడంతో మంచు విష్ణు మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా నిలిచారు.అయితే మా అధ్యక్షుడిగా మారిన తర్వాత విష్ణు మళ్ళీ సొంత భవనం మాట ఎత్తలేదు. ఇప్పటికీ మంచు విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని దాదాపుగా పది నెలలు కావస్తున్నది. ఈ మధ్యలోనే ముక్కుబడిగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సొంత భవనం గురించి ఎవరు మాట్లాడలేదు. దీంతో గతంలో మా అధ్యక్షుడు పదవి కోసం రాజేంద్రప్రసాద్ తో పోటీపడి ఓడిపోయిన జయసుధ ఇప్పుడు మంచు విష్ణు పై ఘాటుగా స్పందించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.మా ఎన్నికలు గొడవలు చాలా అనూహ్యంగా మారిపోయాయని అవి, భరించలేక తాను నెలరోజుల పాటు అమెరికాకు వెళ్లిపోయానని తెలియజేసింది జయసుధ. ఇండస్ట్రీ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న జయసుధ ప్రస్తుత వయసు 75 సంవత్సరాలు. మా భవనం పూర్తి అవుతుందా లేదా తనకి ఇంకా అర్థం కావడం లేదని మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి అందరూ ఆ మాటలు చెబుతూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం ఎవరూ ఎందుకు చేయలేదో అర్థం కాలేదని ఆ విషయంపై ఎవరూ కూడా అడగడం లేదని జయసుధ తెలియజేసింది. మరి ఈ విషయంపై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జయసుధ కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నది.