చలనచిత్ర పరిశ్రమలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు. ఇక భలే మిత్రులు సినిమా ద్వారా 1985లో తెలుగు తెరకు పరిచయమైన రమ్యకృష్ణ.. తన కెరియర్ తొలి దశలో ఐరన్ లెగ్ లేడీ గా ఎక్కువగా ముద్ర వేయించుకుంది. ఇక కష్టపడి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి కారణం స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు అని చెప్పవచ్చు . ఆయన దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు సినిమాతోనే అప్పటివరకు ఫెయిల్యూర్ బాటలో పయనిస్తున్న ఈమె కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
ఇక ఈ సినిమాతో తన నటనను నిరూపించుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక తర్వాత ఈమె వెను తిరిగి చూసుకోలేదు. ఎక్కువగా రాఘవేంద్రరావు సినిమాలలో నటించిన ఈమె కుటుంబ ప్రేమ కథ నేపథ్య చిత్రాలలోనే కాకుండా దేవతా పాత్రలో, విలన్ గా, నెగిటివ్ రోల్స్ కూడా రమ్యకృష్ణ చేసింది. ఇకపోతే ఈమె కెరియర్ లో జరిగిన ఒక విచిత్రం ఏమిటంటే.. ఒక నటుడికి.. కూతురిగా, చెల్లిగా, భార్యగా కూడా నటించింది. ఇక ఆ నటుడు ఎవరో కాదు మంచి మంచి పవర్ఫుల్ సపోర్టు పాత్రలతో పాటు మంచి విలన్ పాత్రలు కూడా పోషించిన నాజర్.
ఈయనతోనే ఈమె ఎక్కువగా ఇలాంటి పాత్రలు చేసి అలరించిందని చెప్పవచ్చు. ఇక వరల్డ్ రికార్డు నెలకొల్పిన బాహుబలిలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించగా.. బిజ్జల దేవుడిగా ఆమె భర్త పాత్ర పోషించారు నాజర్..
ఇక రజనీకాంత్ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నాజర్ కి చెల్లిగా నటించి విలన్ గా అందరిని అలరించింది. ఇక వంత రాజవతాన్ వరువేన్ అనే చిత్రంలో తమిళ సినిమాలో ఈమె నాజర్ కూతురు పాత్రలో నటించారు. ఇలా అత్తారింటికి దారేది సినిమాకి తమిళ్ రీమేక్ కాగా తెలుగులో నదియా పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించడం జరిగింది.