స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా మంచి హృదయంతో మరింత మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కే సినిమాతో అఖండకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఇటీవల రవీంద్రభారతిలో సి నారాయణరెడ్డి 91వ జయంతి వేడుకలు జరగగా ఈ వేడుకలలో పాల్గొన్న బాలయ్య మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా సి.నారాయణ రెడ్డి జీవిత సాఫల్య స్వర్ణకంకణమును స్వీకరించారు. ఇక ఈ అత్యున్నతమైన అవార్డును సొంతం చేసుకున్న తర్వాత బాలయ్య మాట్లాడుతూ.. సాహిత్యాన్ని బ్రతికించిన వారిలో సి.నారాయణరెడ్డి కూడా ఒకరు. ముఖ్యంగా ఈయన వల్లే నేను నటుడిగా మారాను. ఇక నాలో ఉన్న నటుడిని గుర్తించి నా తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు చెప్పిన వ్యక్తి సి.నారాయణరెడ్డి గారు. ఇక ఆయన లేకపోతే నాలో ఉన్న నటుడిని నా తండ్రి గుర్తించేవారు కాదేమో ఆయన వల్లే నేను ఇలా మారాను అంటూ బాలయ్య తెలిపారు.
ఇక సి.నారాయణరెడ్డి మా కుటుంబంలో ఒకరు ఆయన ఆశీస్సులతో భవిష్యత్తులో ఎన్నో మంచి మంచి పాత్రలతో నటించి మెప్పిస్తాను. ముఖ్యంగా ఈ సి. నారాయణరెడ్డి జీవిత సాఫల్య స్వర్ణకంకణం నేను స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు. ఈ మాటలు కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక బాలయ్య బాబు సినిమా విషయానికి వస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాను 2023 జనవరిలో విడుదల చేస్తున్నట్లు సమాచారం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు బాలయ్య.