డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పోన్నియన్ సెల్వన్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్, హీరోయిన్ త్రిష ,కార్తీ , జయరామ్ రవి తదితరులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి చిత్రబంధం సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా షూటింగ్ లు జరుపుకుంటున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి తరచూ అప్డేట్ విడుదల చేస్తూ ఈ సినిమా పైన భారీగాని అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు మణిరత్నం అభిమానులు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఓటిటి సమస్త అభివృద్ధి చెందిన తరుణంలో ప్రతి ఒక్క సినిమా థియేటర్ లో విడుదలైన తరువాత 60 రోజులలో ఓటీటి లో విడుదలవుతూ వస్తున్నాయి.
ఇలాంటి క్రమంలోని ఈ సినిమా డిజిటల్ హక్కులను మొత్తం ప్రముఖ ఓటిటీ సంస్థ ఆయన అమెజాన్ భారీ ధరకే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా మొదటి భాగాన్ని రూ.128 కోట రూపాయలకు హక్కులను దక్కించుకున్నట్లుగా సమాచారం. ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ సినిమాకు దక్కని భారీ డీల్ ను ఈ సినిమా చేసుకోవడం గమనార్హం. ఈ విధంగా అమెజాన్ భారీ ధరకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసమే.. రూ.24 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం మరియు సినిమా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.