బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో సినిమాలలో పలు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఉన్నది అనసూయ. ఎక్కువగా ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. దీంతో ఇప్పుడు డైరెక్టర్లు సైతం ఈమె తో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇలాంటి అవకాశాల కోసమే ఆమె జబర్దస్త్ ను కూడా వీడింది అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక పోస్టును కూడా చేయడం జరిగింది అనసూయ.కానీ ఈమె కూడా సినిమా ఎంపిక కథ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె నటిస్తున్న చిత్రాలు అన్ని ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కావడంతో ఈమె పైన ఆ సినిమాల ప్రభావం ఎక్కువగా చూపలేదు.. దీంతో ప్రేక్షకుల ఆదరణ ప్రతి రోజుకి కరువు అవుతోందని సమాచారం. అనసూయ ముఖ్యమైన పాత్రలో నటించిన కథనం, థాంక్యూ బ్రదర్, దర్జా వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అనసూయ కి ఉన్న క్రేజ్ వల్ల తక్కువ బడ్జెట్ తోని ఈ సినిమాలను పూర్తి చేసిన.. కలెక్షన్ల పరంగా రాబట్ట లేకపోయినట్లు తెలుస్తోంది.ఇక గతంలో కూడా రష్మీ బుల్లితెరపై నుండి వెండి తెరమీదకు వెళ్లి మంచి పాపులారిటీ సంపాదించుకుంది కానీ హీరోయిన్గా పలు చిత్రాలలో నటించిన కథ కథనాల ఎంపిక విషయంలో కాస్త నిర్లక్ష్యం చేసి అవకాశం వచ్చిన సినిమాలలో నటించి ఉండడం చేత ఈమెకు హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా మంచి సక్సెస్ను అందించలేదు.. దీంతో రష్మీ కేవలం బుల్లితెరపైనే కనిపిస్తానని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పుబోతున్నట్లు తెలియజేసింది. ఇక అనసూయ కూడా కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పడకపోతే ఇక ఆమె కెరియర్ కూడా రష్మీ మాదిరే అవుతుంది అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.