అర్దాంతరంగా భర్తను కోల్పోయి.. దుఃఖంలో మునిగిన హీరోయిన్లు వీళ్ళే?

సినిమా ఇండస్ట్రీ.. చూసే ప్రేక్షకులందరికీ బయట నుంచి ఎంతో అందంగా ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. సినిమావాళ్ళకి ఏంటి సినిమాల్లో నటించడం కోట్ల రూపాయలు సంపాదించడం ఒక విలాసవంతమైన జీవితాన్ని గడపడం.. అంతకంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ తెరమీద నవ్వుతూ ప్రేక్షకులను అలరించే నటీనటుల జీవితాలను కదిలిస్తే కన్నీళ్లు పెట్టించే ఎన్నో బాధలు ఉంటాయి అన్నది మాత్రం కొంత మందికి మాత్రమే తెలుసు. టాలీవుడ్ లోఎంతోమంది నటీమణులు అర్ధాంతరంగా జీవిత భాగస్వామిని కోల్పోయి చివరికి ఒంటరి వారు అయినా వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేఘన రాజ్ : కన్నడ సూపర్ స్టార్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి సర్జా భార్య మేఘన రాజు. చిరంజీవి సర్జా తో పెళ్లయిన తర్వాత మేఘనారాజ్ జీవితం ఎంతో సంతోషంగా ఉంది. కానీ రెండేళ్లకే భర్త చనిపోవడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన చనిపోయిన సమయానికి ఆమె ఐదు నెలల గర్భవతి. చిరంజీవి సర్జా చనిపోయే సమయానికి ఆయన వయసు 35 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం.

భానుప్రియ : చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ను ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న భానుప్రియ ఆదర్శ కౌశల్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని అమెరికా వెళ్లి పోయింది భానుప్రియ. ఎంతో సంతోషంగా ఉంది అనుకున్నారు అంతా.. కానీ చివరికి భర్త తో గొడవలు రావడంతో చెన్నై కి వచ్చేసింది. ఇక ఇటీవలే భానుప్రియ భర్త గుండెపోటు కారణంగా ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో చెన్నై నుంచి అమెరికాకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు భానుప్రియ.

మందిర బేడీ : సాహో సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది మందిర బేడీ. ఇక మరోవైపు ఆమె భర్త రాజ్ కౌశల్ కూడా దర్శకుడిగా ఎంతో పాపులారిటీ సంపాదించారు. కానీ హఠాత్తుగా 50 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ఆయన దీంతో మందిరాబేడీ అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది.

సురేఖ వాణి : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా లేడీ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న సురేఖ వాణి సురేష్ తేజ ను ప్రేమ వివాహం చేసుకుంది.. టీవీ ప్రోగ్రాములు గా టీవీ షోలకు డైరెక్టర్గా పనిచేశారు సురేష్ తేజ. కానీ యంగ్ ఏజ్ లోనే అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి మరో పెళ్లి చేసుకోకుండా సురేఖ కూతురు కోసమే జీవిస్తోంది.

రేఖ : టాలీవుడ్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రేఖ.. హాట్ లైన్ కిచెన్ వేర్ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఆ తర్వాత ముఖేష్ కి గతంలోని పెళ్లి జరిగిందని తెలియడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఇక వ్యాపారంలో నష్టాలు రావడంతో ముఖేష్ అగర్వాల్ సూసైడ్ చేసుకున్నారు.

జయసుధ : టాలీవుడ్ లో సహజనటిగా గుర్తింపు సంపాదించుకున్న జయసుధ నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు.. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.

కవిత : సీనియర్ నటి కవిత తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఇక ఈయన భర్త దశరథ రాజునీ కరోనా వైరస్ బలితీసుకుంది. అది కాకుండా కరోనా వైరస్ తోనే కవిత కుమారుడు స్వరూప్ కూడా మరణించారు. దీంతో కవిత ఒంటరి అయిపోయి శోకసంద్రంలో మునిగిపోయింది..