రాధేశ్యామ్‌ స్లోగా ఉందా..అందరి నోర్లు మూయించిన థమన్‌..ఇచ్చిపడేశాడుగా..!!

గత మూడేళ్ళ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్..స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా “రాధేశ్యామ్‌”. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా నిన్న భారీ రేంజ్ లో గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ముందు నుంచే ఈ సినిమా పై అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. దీంతో సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉంటాదా అని అంతా వెయిట్ చేశారు. ఇక సినిమా చూసి బయటకు వచ్చిన జనాలు ఓకే ఓకే సినిమా అనడంతోనే ప్రభాస్ అభిమానులు డల్ అయిపోయారు.

ఇండియాలో కంటే ముందే యూస్ సహా మిగతా దేశాలలో ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో టాక్ ముందే బయటకు వచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇక సినిమా పరంగా చెప్పాలంటే స్టోరీ లైన్ బాగుంది..కానీ దాని అనుకున్నంత రేంజ్ లో తెరకెక్కించలేకపోయాడు డైరెక్టర్. మెయిన్ పాయింట్ ప్రభాస్ రేంజ్ కి సూట్ అయ్యే సినిమా కాదు ఇది. హీరోయిన్ అందాలతో సినిమా ను కొంచెం లాకొచ్చినా..పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. జగపతి బాబు,భాగ్యశ్రీ లాంటి బడా స్టార్స్ ని వాడుకోలేకపోయాడు రాధ. కధ కూడా అభిమానులు ఎక్స్ పెక్స్ట్ చేసినంత లేదు. దీంతో సినిమా పై మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఇక కొందరు నెటిజన్స్ సినిమా స్లోగా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ అద్దిరిపోయే పంచ్ వేస్తూ అందరి నోర్లు మూయించాడు. తనదైన స్టైల్ లో పంచ్ వేస్తూ.. ఓ మీమ్ ను షేర్ చేశాడు. వెంకీ సినిమాలో బ్రహ్మానందం సన్నివేశాన్ని మీమ్‌గా క్రియేట్‌ చేసిన ఫోటోను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు థమన్‌. ఈ మీమ్ లో బ్రహ్మానందం స్నెహ ని సినిమా ఎలా ఉందని అడుగుతాడు.. దానికి స్నేహా బాగా స్లోగా ఉందని సమాధానం చెబుతోంది. దీంతో బ్రహ్మానందం ఫైర్ అవుతూ.. ‘నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్‌ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్‌ హాఫ్‌లో ఫస్ట్‌ నైట్‌, సెకండాఫ్‌లో సెకండ్‌ సెటప్‌ పెట్టాలా ఏంటి?’ అని రాధేశ్యామ్‌ సినిమా ని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ కి గట్టిగానే సమాధనం ఇచ్చాడు. ఇక దానికి థమన్‌ క్యాప్షెన్ ఇస్తూ.. ‘స్లో అంటే.. నువ్వు పరిగెత్తాల్సింది. మీమ్‌ అదిరింది’ అంటూ పంచ్‌ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.