రాజమౌళి డైరెక్షన్ లో పుష్ప రాజ్.. ఇక తగ్గేదేలే..?

యస్..గత కొన్ని గంటల నుండి ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున ఓ సినిమా చేయబోతున్నాడని..అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నారనే ఓ టాక్ సినీ వర్గాల దగ్గర నుండి లీకైంది. దీంతో ఈ వార్త నెట్టింట సెకన్స్ లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం రాజమౌళి చరణ్-తారక్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా అయిపోయిన తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టేశారు విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా ఆప్రికా అడవుల నేపధ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి-మహేష్ సినిమా కంప్లీట్ అవ్వగానే..వెంటనే జక్కన్న బన్నీ తో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మేరకు ఇప్పటికే జక్కన్న, బన్నీల మధ్య పలుమార్లు చర్చలు జరిగినట్టు సమాచారం. ఎప్పటినుండొ బన్నీ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అని కోరుకుంటున్న అభిమానులకు ఇదే గుడ్ న్యూసే అని చెప్పాలి, అయితే ఈ క్రేజీ ప్రాజక్ట్‌​కు సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రీసెంట్ గానే బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో “పుష్ప-ది రైజ్” అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో ఆయన పుష్ప రాజ్ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. ఈ సినిమా ఆయన కెరీయర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా రికార్డ్ నెలకోల్పింది.