పాతతరం సినీ నటి, అప్పట్లో అగ్రశ్రేణి హీరోయిన్గా చలామణి అయిన.. జమున గురించి అందరికీ తెలిసిందే. ఆదిలో జమున-అక్కినేని నాగేశ్వరరావు జంటగా అనేక సినిమాలు వచ్చాయి. ఆ సమయంలో సావిత్రి-ఎన్టీఆర్ కాంబినేషన్ అదిరిపోతుంటే.. జమున-అక్కినేనిలు మరోవైపు.. దుమ్మురేపేవారు. అయితే.. తర్వాత కాలంలో అన్నగారితోనూ జమున పలు సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో అన్నగారు.. సినీ పరిశ్రమను హైదరాబాద్కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జమున విషయంలో అన్నగారు చూపిన చొరవ, తీసుకున్న చనువు.. అనేక అపార్థారాలకు తావిచ్చిందని అప్పట్లో సినీ ఇండస్ట్రీ పెద్దలు చెప్పుకొనేవారు.
విషయంలోకి వెళ్తే.. అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తమిళనాడులో ఉన్న తెలుగు చిత్రసీమను హైదరాబాద్కు ఆహ్వానించారు. ఈ క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు.. వంటి కీలక హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది హైదరాబా ద్కు వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో జమున, సావిత్రి వంటి అగ్రశ్రేణి నటులు మాత్రం రాలేదు. సావిత్రి అంటే.. అక్కడే వివాహం చేసుకున్నారు కనుక.. ఆమె అక్కడే ఉన్నారు. కానీ, జమున మాత్రం ఏపీకి చెందిన వ్యక్తినే వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అన్నగారు పట్టుబట్టి.. జమునను హైదరాబాద్కు వచ్చేలా చేశారు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరుండి మరీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇంటి స్థలం కేటాయించారు.
అంతేకాదు.. అధికారంలో ఉన్నప్పుడు.. జమున ఇంటి నిర్మాణాన్ని స్వయంగా అన్నగారే పర్యవేక్షించారు. నిజానికి అప్పటికీ ఇంకా రెండో వివాహం చేసుకోలేదు. ఈ క్రమంలో జమున పట్ల ఎన్టీఆర్ అంత ఇంట్రస్ట్ చూపించడంపై అప్పట్లో సినీ పక్ష పత్రికల్లో పెద్ద ఎత్తున గ్యాసిప్లు వచ్చాయి. వీటిపై సినీ రంగంలోని వారు కూడా పెద్ద ఎత్తున చర్చించుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ.. అన్నగారు కానీ, జమున కానీ.. ఎ క్కడా వీటిపై స్పందించలేదు. అంతేకాదు.. తన ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత.. ఇంట్లో భారీ ఎత్తున అన్నగారి ఫొటోను జమున పెట్టుకోవడం గమనార్హం.
ఆమె నేరుగా తన భర్తను తీసుకుని.. అన్నగారిని కలుసుని.. ఆ ఫొటోలను ప్రెస్కు రిలీజ్ చేశారు. అంతే! అంతకు మించి.. తమపై వస్తున్న గ్యాసిప్లపై ఆమె ఎక్కడా స్పందించలేదు. ఇక, అన్నగారు సైతం వాటిని లైట్ తీసుకున్నారు. అయితే.. అన్నగారు రెండో వివాహం చేసుకునే వరకు కూడా ఈ విషయంపై తరచుగా గుసగుసలు వినిపించడం గమనార్హం.