విజ‌య‌శాంతికి, హీరో వెంక‌ట్‌కు మ‌ధ్య ఉన్న సంబంధం తెలుసా..!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ఒకప్పుడు వెండితెరను ఏలేసింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో తిరుగులేని హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన విజయశాంతి ఆ తర్వాత తన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఆమె కాంగ్రెస్‌లో మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

అనంతరం ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం బిజెపి లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే విజయశాంతి తన కెరీర్లో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ఎన్నో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించారు. కొంత కాలం గ్యాప్ తీసుకున్న విజయశాంతి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ట్‌ చేశారు. ఇక సీనియర్ హీరో వెంకట్ ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేశారు.

సీతారాముల క‌ళ్యాణం చూత‌మురారండి సినిమాతో హీరో అయిన వెంక‌ట్‌కు కాలం కలిసి రాక పోవడంతో అనుకున్న స్థాయిలో హిట్లు పడలేదు. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి వచ్చిన వెంకట్ విజయశాంతితో తనకున్న అనుబంధాన్ని చెప్పారు. వెంకట్ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరియ‌న్స్ మాత్రమే ఇచ్చారు.

చిన్నప్పటి నుంచి విజయశాంతి తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. తమ కంపెనీ కోసం ఆమె మోడల్ గా కూడా పని చేశారు అని వెంకట్ చెప్పారు. అప్పటి నుంచి విజయశాంతితో తనకు మంచి అనుబంధం ఉందని వెంకట్ తెలిపారు. విజయశాంతి అందరితోనూ చాలా సఖ్యతతో ఉంటారు అని.. బాలకృష్ణ కూడా తనకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న వ్య‌క్తి అని… ఆయన షూటింగ్ చూడటానికి తాను కాలేజీ కి డుమ్మా కొట్టి మరి వెళ్లే వాడిని అని వెంకట్ చెప్పారు.