“భీమ్లానాయ‌క్”ని అందుకే రిజెక్ట్ చేశా….. సాయిపల్లవి !

“లాలా భీమ్లా అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు కత్తిపట్టు అదరగొట్టు”.. ఇప్పుడు ఎవ్వరికి కాల్ చేసిన..ఆటో లో కానీ,కార్ లో కానీ వెళ్తున్న అందరికి ఈ పాటనే వినిపిస్తుంది. తమన్ అంత బాగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. బడా బడా స్టార్స్ కూడా ఈ పాటను పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటేనే ఈ పాట జనాలకు ఎంత బాగా రీచ్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కల్యాన్ హీరోగా నటించిన చిత్రం “భీమ్లానాయ‌క్” . ఈ సినిమా కోసం అభిమానులు ఎలా వెయిట్ చేసారో అన్న సంగతి తెలిసిందే.

ఇక విడుదలైందే ఆలస్యం.. బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ రికార్డులు వేట మొదలైంది. మొదటి రోజే నైజాం లో పాత రికార్డులను బద్దలు కొడుతూ సరి కొత్త రికార్డ్ క్రియేట చేసింది భీమ్లానాయ‌క్. ఇక ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి దట్ ఇజ్ పవర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసాడు. ఇప్పుడు అందరు పోకిరి సినిమాలోని డైలాగ్ నే “భీమ్లానాయ‌క్” కలెక్షన్స్ చూసి చెప్పుతున్నారు. “ఎప్పుడు వచ్చామా అన్నది కాదు..రికార్డ్ బద్దలు కొట్టామా లేదా” అంటూ పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి చెబుతున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నిత్యా మీనన్,సంయుక్త మీనన్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రానా భార్య గా మొదట అనుకునింది హీరోయిన్ సాయి పల్లవిని అట. కానీ ఆమె ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటించిన క్యారెక్టర్ కి పెద్దగా వాల్యు లేదని తెలిసి రిజెక్ట్ చేసిందట. కానీ అప్పట్లో సాయి పల్లవి పవన్ మూవీని రిజెక్ట్ చేసిందని వార్తలు హాట్ టాపిక్ గా నడిచాయి. ఆమెకు తలపొగరా..పవన్ సినిమానే రిజెక్ట్ చేస్తుందా అంటూ కొందరు ట్రోలింగ్ కూడా చేశారు. కానీ సినిమా విడుదల అయ్యాక . ఆమె “భీమ్లానాయ‌క్” సినిమా ను వదులుకుని మంచి పనే చేసింది అంటున్నారు ఆమె అభిమానులు. ఎందుకంటే ఈ సినిమాలో రానా భార్య రోల్ చాలా చిన్నది..స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ..దీంతో సాయి పల్లవి డెసీషన్ నే కరెక్ట్ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.