చిరు కోరిక‌ను బాల‌య్య అందుకే రిజెక్ట్ చేశారా…?

తాజాగా ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ టాలీవుడ్ మ‌ధ్య కొంత కాలంగా ఉన్న గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు ఇండ‌స్ట్రీ టాప్ హీరోలు, టాప్ ద‌ర్శ‌కులు వెళ్లి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీకి కొద్ది నెల‌ల ముందు నుంచే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్‌ను క‌లుస్తూ వ‌చ్చారు. అంత‌కుముందు సురేష్‌బాబు, చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు ఓ సారి వెళ్లి జ‌గ‌న్‌ను క‌లిసి వ‌చ్చారు. త‌ర్వాత కొద్ది రోజుల క్రిత‌మే చిరంజీవి ఒక్క‌రే వెళ్లి జ‌గ‌న్‌ను క‌లిసి లంచ్ చేసి వ‌చ్చారు. అయితే అది కేవ‌లం ప‌ర్స‌న‌ల్ భేటీ అని.. ఇండ‌స్ట్రీకి, ఆ భేటీకి సంబంధం లేద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇక మూడు రోజుల క్రితం జ‌రిగిన భేటీలో టాప్ హీరోలు, ద‌ర్శ‌కులు అంద‌రూ పాల్గొన్నారు. ఈ మీటింగ్ కి చిరు, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని తదితరులు కలిసి ముఖ్య‌మంత్రితో స‌మావేశం కావ‌డంతో పాటు త‌మ స‌మ‌స్య‌లు విన్న‌వించుకున్నారు. ఈ భేటీలో చిరంజీవి జ‌గ‌న్‌ను మ‌రి బ‌తిమిలాడుకోవ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు.

స‌రే ఇదిలా ఉంటే ఈ భేటీకి రావాల్సిందిగా చిరు బాల‌య్య‌కు కూడా ఆహ్వానం పంపార‌ట‌. అయితే బాల‌య్య చిరు ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య‌కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వం, ఏపీ సీఎంవో వ‌ర్గాలు నిర్వ‌హించిన ఈ భేటీలో టాప్ హీరోగాను, ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య‌కు ఎందుకు ఆహ్వానం లేదో ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

ఇక ప్ర‌భుత్వం నుంచి నేరుగా త‌న‌కు ఆహ్వానం లేక‌పోవ‌డంతో పాటు తాను ఏపీలోనే ప్ర‌తిప‌క్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేగా ఉండడంతో ఈ భేటీకి వెళ్లేందుకు బాల‌య్య‌కు ఇష్టంలేకే రిజెక్ట్ చేశార‌ని అంటున్నారు. ఇక ఈ భేటీకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాగార్జున కూడా డుమ్మా కొట్టిన సంగ‌తి తెలిసిందే.


Leave a Reply

*