ఎన్టీఆర్ ..కొరటాల శివ సినిమా కధ లీక్ !

జనతా గ్యారేజ్ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా సంగతి అందరకి తెలిసిందే .మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది .ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చిత్ర బృందం చేయలేదు .అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్రం మర్చి నెలలో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారంట.

ఈ సినిమా కధపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్ లో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ‘మూఢనమ్మకాలతో మనుషులు ఎలా పక్కదారి పడుతూ.. తమని తాము ఎలా హింసించుకుంటున్నారో అనే కోణంలో ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలుస్తోంది.2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.