ఫుల్ డిస్సపాయింట్మెంట్..మహేష్ కు ప్ర‌శాంత‌త లేకుండా చేస్తున్న ఆ వ్యక్తి..!!

టాలీవుడ్ ప్రీన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు కూల్ గా స్మైల్ తో హ్యాపీ గా కనిపిస్తుంటారు. పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రన ఆయనకు ప్రాబ్లంస్ లేవు అని కాదు. మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు ఉంటాయి. కానీ వాటి మ్యానేజ్ చేస్తూ..సంతోషాని వెత్తుకోవడం లోనే అసలు జీవితం. ఏదైన ప్రాబ్లం వస్తే బయపడి వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందడుగు వేయాలి..అప్పుడే మనం అనుకున్న విజయాలను సాధించి ముందుకు వెళ్ళగలం. ఇదే విషయాని ఎక్కువుగా నమ్ముతారట మహేష్.

ప్రస్తుతం ఆయన డైనమిక్ డైరెక్టర్ పరశూరం డైరెక్షన్ లో “సర్కారు వారి పాట” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ మే 12న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే చిత్ర యూనిట్ ఎంతో ఆశగా ఈ సినిమాలో కళావతి సాంగ్ ను వాలంటైన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లీకు రాయళ్ళు వాళ్ళ ఆశలను నిరాశ పరుస్తూ..పాట అఫిషియల్ గా రిలీజ్ అయ్యే కొద్ది గంటలు ముందే ఈ పాటను లీక్ చేసారు. దీంతో టోటల్ టీం షాక్ అయ్యింది. మహేష్ కూడా చాలా బాధపడ్డారట. ఇక ధమన్ అయితే ఫుల్ ఎమోషనల్ అవుతూ..నా గుండె బద్ధలైంది అంటూ ఆడియో క్లిప్ ను రిలీజ్ చేసారు. ఇక చిత్ర బృందం ఆ తరువాత మళ్ళీ కళావతి పాటను అఫిషియల్ గా రిలీజ్ చేస్తూ విడుదల చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

కాగా, మహేష్ కూతురు సితార పోస్ట్ చేసిన ఓ ఫోటో కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆ ఫోటోలో సితార..తండ్రిని కింద ప‌డేస్తూ ఆయ‌నను పైకి లేవ‌నివ్వ‌కుండా గట్టిగా పట్టేసుకుంటుంది. ఇక ఈ ఫోటో క్రింద” సండే రోజు నాన్న ప్ర‌శాంత‌త‌ను చెడగోట్టే విషెస్‏లో బిజీగా ఉన్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటో పై నెటిజన్స్ ఫనీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూవీలా విషయానికి వస్తే మహేష్ సర్కారు వారి పాట సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇక ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తోను ఓ సినిమా కు కమిట్ అయ్యాడు మహేష్.