ఆ స్టార్ హీరోతో ఐశ్వ‌ర్య‌ కు ఎఫైర్..సంచలనంగా మారిన ధనుష్ కామెంట్స్..?

కోలీవుడ్ లెజండ్ హీరో రజినీకాంత్ కు ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంత కాలంగా ఆయన సినిమాలు హిట్ కాకపోయినా..అభిమానులు ఆయనను ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఆయన కుటుంబానికి కూడా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉన్నింది. కానీ ఇప్పుడు ఆ పేరు చెడకొడుతుంది రజినీకాంత్ కూతురు ఐశ్వర్య.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌.. యంగ్ హీరో ధ‌నుష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీళ్ల పెళ్లిని గ్రాండ్ గా చేసారు రజనీకాంత్. చూడ చక్కని జంట గా..కోలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ జంట గా పేరు తెచ్చుకున్న ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. నాలుగు సినిమాలో రెండు టూర్లు అంటూ సాగిపోయే వీళ్ల సంసారం పై ఎవ్వరి కళ్లు పడ్డాయో కానీ..హ్యాపీగా కాపురం చేసుకుంటున్న ఈ జంట విడాకులు ప్ర‌క‌ట‌న కోలీవుడ్‌తో యావ‌త్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేస్తోంది.

నిన్న మొన్నటి వరకు కూడా బాగానే ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో అర్ధంకాక చాలా మంది అభిమానులతో పాటు..స్టార్ సెలబ్రిటీలు కూడా షాక్ అయ్యారు. కొందరు అయితే వీళ్ళు మళ్లీ కలుస్తారు అంటూ ఆశలు పెట్టుకుని ఉన్నారు. అయితే రీసెంట్ గా తన విడాకులకు సంబంధించి ధనుష్ తన సన్నిహితుల దగ్గర ఓపెన్ అప్ అయిపోయాడట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..స్టార్ డాటర్ ఐశ్వర్య కి కోలీవుడ్ హీరో శింబు తో అఫైర్ ఉన్నట్లు తెలుస్తుంది. ధ‌నుష్‌తో ప్రేమ‌కు ముందు ఐశ్వ‌ర్య శింబుతో ప్రేమ‌లో ఉంద‌ని కోలీవుడ్ ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వ‌చ్చాయి. నిజానికి ఐశ్వ‌ర్య‌ శింబుకి పెద్ద అభిమానురాలు అని..ఆ తరువాత వీళ్ల మధ్య ప్రేమ చిగురించిందని..పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకున్నారట. కానీ, రజినీకాంత్ కు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ..ఆ రిలేషన్ ను అక్కడితో కట్ చేసిందట. మళ్ళీ ఈ మధ్యనే ఆమె శింబుతో మటాలు స్టార్ట్ చేసి..పాత రిలేషన్ ను కంటీన్యూ చేస్తుందని..ఇది భరించలేకనే ధనుష్ విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.