అది అసలు మ్యాటర్..అందుకే నిత్యా ప్రీ రిలీజ్ కి రాలేదనమాట..తెర వెనక ఇంత జరిగిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కు రీమేక్ గా ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది. ‘భీమ్లా నాయక్‌’ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ రోల్ లో కనిపించనున్నారు. దీంతో అభిమానులు ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.

ఇక రానా ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నట్లు మనకు తెలిసిందే. ఈ సినిమాలో పవన్ భార్య గా నిత్యా మీనన్ నటిస్తుండగా..రానా భార్యగా సంయుక్తా మీనన్ మనకు కనిపించనుంది. అంతేకాదు ఈ సినిమాలో బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్. చాలా రోజుల తరువాత త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ సినిమాకి డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్నిభారీ వ్యయంతో నిర్మించిన సంగతి తెలిసిందే.

కాగా మరి కొద్ది గంటలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం హైదరబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపింది. ఈ కార్యక్రమానికి నటీనటులు, సిబ్బంది అంతా హాజరయ్యారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని రావడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అయితే ఎంత మంది ఉన్నా కానీ ఈ వేడుకలో పవన్ పక్కన నిత్యా లేని లోటు బాగా తెలిసింది. ఈవెంట్ ఇంత భారీగా జరిగినప్పటికీ అందులో నిత్యామీనన్ మాత్రం కన్పించలేదు. దీంతో అభిమానులు కొంతమేర నిరాశ చెందారు. మొన్న నేగా ఆహా లో ఓ సింగింగ్ షో కి జడ్జ్ గా వచ్చి మెప్పించింది. అంతలోనే ఏమైంది..అంటూ నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అసలు నిత్యా మీనన్ ఎందుకు రాలేదు ఫంక్షన్ కి అని ఆరా తీయ్యగా..ఆమె వేరే భాషలో ఓ వెబ్ సీరిస్ పనుల్లో బిజీగా ఉందట. ఆ కారణం చేతనే భీమ్లా నాయక్ ఈవెంట్ కి రాలేకపోయిందట అని అంటున్నారు. అయితే నెటిజన్స్ కి మాత్రం ఈ విషయం నమ్మ బుద్ది కావడంలేదు. నిత్యా రాలేకపోయినా..ఆమె వీడియో తీసి పంపించచ్చుగా .. కానీ అలా చేయలేదు ..దీంతో తెర వెనుక ఏదో జరుగుతుంది అంటూ..చర్చించుకుంటున్నారు.