Officially Official: రెండో బిడ్డ ఆన్ ది వే..గుడ్ న్యూస్ చెప్పిన నిషా అగర్వాల్..!!

నిషా అగర్వాల్..మనకు తెలిసిన వ్యక్తే. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. వరుణ్ సందేశ్ తో కలి ఏమైంది ఈవేళ్ల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు అందం పరంగా మెప్పించగల్గింది కానీ..నటన పరంగా యావరేజ్ మార్కులే వేయించుకుంది. అయితే మొదటి సినిమాలోనే టూ హాట్ గా నటించిన నిషా..ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి హీరోయిన్ అవుతాది అని అనుకున్నారు అంతా. కానీ, సీన్ రీవర్స్ అయ్యింది.

అమ్మడు మొదటి సినిమా మాత్రమే అంతో ఇంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత చేసినవి అన్నీ అట్టర్ ఫ్లాప్ అయాయి. పైగా ఆ సినిమాల్లో అమ్మడు ఎక్స్ పోజింగ్ కు నో చెప్పిందట. దీంతో మన వాళ్లు కూడా ఆమెను హీరోయిన్ గా నో చెప్పేశారు. ఇక కొద్ది కాలం సినిమా అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ అమ్మడు..ఇక ఈ సినిమాలు మనకు వర్క్ అవుట్ కావు అనుకుని ..ఫైనల్ గా తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని..పిల్లాడిని కనేసింది. ప్రజెంట్ భర్త, బాబుతో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

కాగా సినిమాలకు దూరమైన అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలన్ని కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఇక తన అక్క కాజల్ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వాళ్ళ స్టైల్ లో సీమంతం కూడా జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే , తాజాగా నిషా తన అక్క బేబీ బంప్ ను పట్టుకుని..ఓ పోస్ట్ పెట్టింది. “త్వరలోనే నా రెండవ బిడ్డ రాబోతున్నాడు. ఆన్ ది వే.. నా బిడ్డను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నాను.’ అని నిషా కాజల్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక కాజల్ హీరోయిన్ గా చిరంజీవి పక్కన నటించిన చిత్రం ఆచార్య రిలీజ్ కు సిద్ధంగా ఉంది.