మంచం పైన నుంచి కదలలేని స్థితిలో సింగర్ కౌసల్య

తెలుగు నాట అద్భుత గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ కౌసల్య పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ టాప్ సింగర్ కు తాజాగా కరోనా సోకింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పింది. కరోనా లక్షణాలు తనకు చాలా సివియర్ గా ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. ప్రస్తుతం బెడ్ మీద నుంచి లేచి నడిచే పరిస్థితి కూడా లేదని చెప్పింది. కరోనా కు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నట్లు చెప్పింది. అయితే తను ఉన్న స్థితి నుంచి మెరుగు పడాలి అంటే చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయం అందరికీ చెప్తున్నానని.. తన కోసం అభిమానులు ప్రార్థించాలని వేడుకుంది.

 

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఎక్కడ చూసి పలువురు సినీ తారలు కరోనా బారిన పడ్డారు. మూడో వేవ్ లో సినిమా పరిశ్రమలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సారి కరోనా కేసులు ఇంత వేగంగా వ్యాపిస్తాయని ఎవరూ ఊహించడం లేదు. గతంతో పోల్చితే ఈ సారి సినిమా పరిశ్రమలో కరోనా కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో సినిమా జనాలు భయపడుతున్నారు. అసలు షూటింగ్ కు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.  .

అటు ఇప్పటికే సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు సైతం కరోనా సోకింది. మెగా స్టార్ చిరంజీవికి కరోనా వచ్చింది. తాజాగా తను కోలుకున్నా.. ఇంటికే పరిమితం అయ్యాడు. ఇప్పటికే తనకు రెండుసార్లు కరోనా వచ్చింది.  ఈ నేపథ్యంలో తను జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అటు రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, శ్రీకాంత్, మహేష్ బాబు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే  త్రిష, సత్యరాజ్, థమన్ కోవిడ్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో పలువురు సినమా హీరోలు సైతం షూటింగులకు దూరంగా ఉంటున్నారు. కరోనా మూడో వేవ్ తగ్గితేనే షూటింగులకు వస్తామని పలువురు సినీ తారలు నిర్మాతలకు చెప్తున్నారు.