రాంగోపాల్ వర్మ ‘కొండా ‘ మూవీ థియేట్రికల్ ట్రైలర్

వివాదాల టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘కొండా’. తెలంగాణ రాష్ట్రము నాటి సమైక్య ఆంధ్రాలో ఉన్న వరంగల్ జిల్లాలో కొండా మురళీధర్, కొండా సురేఖ దంపతులు దశాబ్దకాలం పాటు తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించారు. . వారివెనుకతెలిసిన రాజకీయ ప్రయాణం , ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని రామ్ గోపాల్ వర్మ వెండితెరమీద ‘కొండా’ చిత్రం ద్వారా వాళ్ళ జీవిత ఎత్తు పల్లాలు చూపించే ప్రయత్నం చేసారు .

కొండా సినిమా షూటింగ్ ను గత ఇయర్ అక్టోబర్ 12న కొండా మురళి స్వగ్రామమైన వంచనగిరిలో ప్రారంభమైంది. షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధమవుతున్న కొండా సినిమా యొక్క ట్రైలర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా రీలీజ్ చేశారు . కొండా సినిమాలో ప్రధాన పాత్రలైనా కొండా మురళిగా త్రిగుణ్ (అదిత్ అరుణ్) నటించగా, ఆయన భార్య సురేఖగా ఇర్రామోర్ నటించారు. అలాగే యల్బీ శ్రీరామ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, పృధ్వి, తులసి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు