ఆ సింగరే కావాలంటూ మహేష్ బాబు ఏకంగా పైరవీ కూడా చేశాడట

తెలుగు ప్రేక్షకుల మదిని పులకరింప చేస్తున్నాడు. ఇంతలా చెబుతున్నానంటే ఆ సింగర్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిన సిద్దు శ్రీరామ్. స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఈ సింగర్ డేట్స్ కోసం ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా.. లిరిక్స్ ఎలా ఉన్నా అతను ఆ పాట పాడాడు అంటే హిట్ అవ్వడం ఖాయం. యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం పక్క. ప్రస్తుతం అందరిలో ఇదే భావన ఉంది. ఇటీవలి కాలంలో చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాల్లో సిద్ శ్రీరామ్ పాటలు పాడుతూ అదరగొడుతున్నాడు. ఇతను పాడిన పాటలు మొత్తం టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సీద్ శ్రీరామ్ డిమాండ్ ఎంతలా పెరిగి పోయింది అంటే అతడి కోసం పైరవీలు కూడా చేసేందుకు వెనుకాడటం లేదట టాలీవుడ్ ప్రముఖులు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సిద్దు శ్రీరామ్ కోసం పైరవీలు చేయక తప్పలేదు అంటూ టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కార్ వారి పాట. ఇక ఈ సినిమాలో ఒక మెలోడీ సాంగ్ ఉంది. అయితే ఈ సాంగ్ ను ముందు నుంచే సిద్దు శ్రీరామ్ తో పాడించాలని అనుకున్నారట. కానీ సిద్దు శ్రీరామ్ డేట్స్ ఇచ్చిన సమయానికి ట్యూన్ రెడీ కాలేకపోవడంతో .. తరువాత డేట్స్ లో సిద్దు శ్రీరామ్ వేరే సినిమాలతో బిజీ అయ్యాడట. దీంతో ఏం చేయాలో అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగారట. తన పలుకుబడితో సిద్దు శ్రీరామ్ రప్పించారాట. ప్రస్తుతం ఈ పాట రికార్డింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సిద్దు శ్రీరామ్ కోసం స్వయంగా మహేష్ బాబు రంగంలోకి దిగారు అంటే అతనికి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.