సినీ యాక్టర్ కరాటే కళ్యాణి పై కేసు నమోదు..!

సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కరాటే కళ్యాణి. బిగ్ బాస్-4 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఈమె పై తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు గా తెలుస్తోంది. అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కరాటే కళ్యాణి. ఈసారి పోలీస్ కేసు తో మరొకసారి వార్తల్లో నిలిచింది ఈమె.

ఇక అసలు విషయంలోకి వస్తే.. ఒక వ్యక్తి హత్య కేసులోని సాక్ష్యాలను కల్యాణి నీ విచారించే ప్రయత్నం చేసినట్లుగా అక్కడ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ పరిధిలో సింగరేణి కాలనీలో.. ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపేశారు. హత్యకు సంబంధించిన వివరాలను కళ్యాణి ని విచారించే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇక అందుకు సంబంధించి ఎల్లమ్మ బండ లోని తూటం శెట్టి నితీష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా కంప్లైంట్ చేశారు. ఇక ఈ కంప్లైంట్ ను పరిశీలించిన కోర్టు కరాటే కళ్యాణి పై కేసు నమోదు చేసినట్లు గా పోలీసులు తెలియజేశారు.