ఆ బాధ ఎవరికి రాకూడదు.. శివ రాజ్ కుమార్?

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యులను, లక్షలాది మంది అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసి వెళ్లిపోయారు. ఆయన కళ్ళు మూసి నాలుగు రోజులు అవుతున్నా అతని జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు తిరుగుతూనే ఉన్నాయి. అతను చనిపోయాడు అన్న వార్తను ఇప్పటికీ తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పునీత్ అన్న హీరో శివరాజ్ కుమార్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పునీత్ మరణం మా కుటుంబానికి తీరని శోకం, నా చేతులతో ఎత్తుకుని ఆడించా. ఈ బాధలు ఎవరికి రాకూడదు అని ఎమోషనల్ అయ్యాడు.

అలాగే పునీత్ కు పాలశాస్త్రం చేయడం ఎంత వరకు సరి అనేది అర్థం కావడం లేదు. పాలశాస్త్రం ముగియగానే అభిమానులను కంఠీరవ స్టూడియో లో సమాధి వద్దకు అనుమతించడం పై సీఎంతో చర్చిస్తానని అన్నారు. పునీత్ ఇంటి సెక్యూరిటీ గార్డ్ రామచంద్రప్ప పునీత్ గురించి మాట్లాడుతూ అతను దేవుని వంటి వాడు. ఇంత మంచి పేరు సంపాదించిన వ్యక్తి ని దేవునిగా భావించాం. అలాగే ఎవరైనా అభిమానులు ఇంటి వద్దకు వస్తే కసురుకోవద్దు అని చెప్పేవారు. హీరో అయినప్పటికీ తనను అన్నా అని పిలిచేవారు అంటూ పునీత్ ని గుర్తు చేసుకున్నారు. పునీత్ అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద సమాధిని చూడాలని పడిగాపులు కాస్తున్నారు. కానీ పోలీసులు వారిని అనుమతించడం లేదు.