వారి మీద కోర్ట్ కి వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..?

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రకాష్ రాజ్ ఆయన ప్యానెల్ సభ్యులు నిన్నటి రోజున విలేకరుల సమావేశం ముందు మాట్లాడుతూ ఫ్యానల్ సభ్యులంతా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకు రాజీనామా చేశారు ఆ 11 మంది సభ్యులు మీడియా ముందు రా తెలియజేశారు.

అలా మాట్లాడిన తరువాత అనసూయ బయటికి రావడంతో మీడియాపై నిప్పులు చెరిగింది. కోర్టుకు వెళ్తానని అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇక తన ప్యానెల్ సభ్యులు చెప్పాల్సిందంతా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేశారు. ఇక తాను చెప్పడానికి ఏమీ లేదని తెలియజేసింది.

తను కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత గెలిచానని కొందరు కంగ్రాట్స్ తెలియజేశారని.. అంత వేగంగా బయటకు సమాచారం ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించింది.? అంతేకాకుండా రాత్రి రాత్రి ఫలితాలు ఎలా తారుమారయ్యాయి అని ప్రశ్నలు వేస్తోంది. ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ వెబ్సైట్ పత్రికలో తన గురించి అబద్దాలు రాస్తున్నారని.. అలాంటి వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నానని.. నిజాలు రాయాలని.. తన ప్రమేయం లేకుండా తన గురించి రాసిన తప్పుడు వార్తలు పై కేసు పెడతాను అంటూ కోర్టుకు వెళ్తానని తెలియజేస్తోంది అనసూయ.