కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు, సెలబ్రిటీలు షాక్ కి గురయ్యారు. ఈ మేరకు పలువురు సెలబ్రిటీలు పునీత్ రాజ్ మృతి పై స్పందిస్తూ నివాళులర్పించారు. అయితే రాంగోపాల్ వర్మ పునీత్ రాజ్ కుమార్ పై ఈ విధంగా స్పందించాడు.
పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అనేది ఒక విషాదం అని వర్మ తెలియజేశారు. అంతేకాకుండా మనలో ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజమని చెప్పుకొచ్చాడు వర్మ. కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో జీవించడం చాలా మంచిదని చెప్పుకొచ్చాడు. పునీత్ రాజ్ కుమార్ మృతిపై సంతాపం తెలియజేశారు. ఇక తాజాగా బెంగళూరు ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్ మృతి కారణంగా కాలేజెస్, స్కూల్స్, థియేటర్ వంటివి మూసి వేయడం జరిగింది.
ఇక పలు సంస్థలకు కూడా రెండు రోజులు సెలవు దినము కూడా ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా పవర్ స్టార్ చనిపోవడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతోంది.
Apart from the shocking tragedy that @PuneethRajkumar ‘s sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime 😳😳😳 So it is best to live life on a fast forward mode , while we are still alive🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2021