మహిళలకు.. నరేంద్ర మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్న నటి..!

ప్రముఖ డ్యాన్సర్, నటి సుధా చంద్రన్ తాను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన ప్రతి సారి బాధపడుతున్నానని కనీసం తన లాంటి సీనియర్ సిటిజన్లకు ఒక నిర్దిష్ట కార్డు నైనా జారీ చేయాలంటూ ప్రధాన మోడీకి ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది సుధాచంద్రన్. కారు ప్రమాదంలో తన కాళ్లను కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో డాన్స్ చేసి భారత దేశం గర్వపడేలా చేసిన ఈమెకు ఎయిర్పోర్ట్ వెళ్ళిన ప్రతిసారి సెక్యూరిటీ తీరుతో చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొస్తోంది.

ఎయిర్ పోర్ట్ కి వెళ్ళావా ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తన కృత్రిమ కాలు తొలగించామని చెబుతున్నారని.. దీనివలన మన చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొస్తోంది. ప్రమాదవశాత్తు కాలు కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలు గా చరిత్ర సృష్టించడమే కాకుండా.. దేశం గర్వపడేలా చేశానని.. అలాంటి నన్ను సెక్యూరిటీ సిబ్బంది అది కూడా పేలుడు ట్రస్ట్ డిటెక్టర్ తనిఖీ చేయడం వల్ల చాలా బాధ కలుగుతుంది అంటూ చెప్పు వస్తుంది.

ఇది మన సమాజంలో ఒక మహిళకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టుగా ఆమె తెలియజేసింది.

https://www.instagram.com/p/CVSmB8iIDUJ/?utm_source=ig_web_copy_link