బ్రేకింగ్: మోహన్ బాబు అరుస్తున్నారు..ఎలెక్షన్ కమీషన్ వార్నింగ్..!

గత కొన్ని రోజుల నుంచి మా అధ్యక్ష పదవి కోసం సినీ ఇండస్ట్రీ లో తారలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ.. వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇరువర్గాల ప్యానెల్ సభ్యులు కూడా ఒకరినొకరు ద్వేషించుకొంటూ రకరకాలుగా వీడియోలను కూడా బయట పెట్టుకున్నారు. నిన్న రాత్రి వరకు ఒకరినొకరు తిట్టుకొని, కొట్టుకొనే పరిస్థితి వరకు చేరుకున్న వీరు ఈరోజు ఉదయం ఒకరికొకరు కౌగిలించుకుంటూ ఎంతో సంతోషంగా ఎన్నికలు నిర్వహించడానికి బయలుదేరారు.

ఈరోజు ప్రకాష్ రాజ్ తరఫున ఎవరో దొంగ ఓటు వేశారని మోహన్ బాబు ఆరోపించారు. పోలింగ్ సెంటర్లో పెళ్లి మోహన్ బాబు పెద్ద ఎత్తున అరవడం మొదలు పెట్టడంతో, ఎన్నికల అధికారి ఒక్కసారిగా కోపానికి గురయ్యారు. అంతే కాదు బయట వాళ్ళు ఎవరైనా సరే లోపలికి వచ్చి అరిస్తే ఎన్నికలు రద్దు చేస్తాం అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషనర్ ఒక్కసారిగా ఈ మాట అనడం తో గొడవ సద్దుమణిగింది. అయితే చివరి వరకు ఎదురు చూస్తే తప్ప ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం అన్నట్లుగా ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి.