భారీ ధరకు అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ సినిమా..!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ రాణాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది.ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు.

ఇక దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యధిక ధరకే ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇది మల్టీ స్టారర్ సినిమా కావడంతో అమెజాన్ ప్రైమ్ 150 కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.

అయితే అమెజాన్ వారు వకిల్ సాబ్ మూవీ రైట్స్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమా క్లిక్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఈజీగా 100 కోట్ల షేర్ వసూలు చేస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా బాగుంటే మాత్రం నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది