పూరి జగన్నాథ్ సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు. హీరోలకు,హీరోయిన్లకు మాత్రమే ఫ్యాన్స్ ఉండటం చూశాను కానీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడైతే సినిమాలను తెరకెక్కించడంలో మొదలుపెట్టాడు అప్పటి నుంచి పూరి జగన్నాథ్ కూడా అభిమానులు పెరగడం జరిగింది.పూరి జగన్నాథ్ మొదట సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ పూరిజగన్నాథ్ తన మొదటి సినిమాతోనే ఒక స్టార్ హీరోతో తెరకెక్కించడం జరిగింది. బద్రి సినిమాతోనే తన కెరీర్ను ప్రారంభించారు పూరి జగన్నాథ్.ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో తీశాడు.తన స్నేహితుడైన చోటా కే నాయుడు కి ఒక స్టోరీని వినిపించాడు పూరి జగన్నాథ్. ఇక అదే స్టోరీని చోటా కె నాయుడు పవన్ కళ్యాణ్ కోసం ఆ కథను వినిపించగా..అందుకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఒప్పుకునేందుకు చాలా టైం తీసుకుంటాడు.. ఆ తర్వాత డైరెక్టర్ పూరి తన దగ్గర ఉన్న కథ వినడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే చోటా కె.నాయుడు చెప్పింది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ . కానీ పవన్ కళ్యాణ్ కి చెప్పిన కథ మాత్రం బద్రి సినిమాకు సంబంధించి కథ.ఈ కథ చెప్పడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని ఇలా చేసానని పూరి జగన్నాథ్ ఒకానొక సమయంలో తెలియజేశాడు.