పెళ్లి విషయంలో టాలీవుడ్ లో కొత్త ధోరణి..?

సాధారణంగా పెళ్లి అనేది ఒక మనిషి జీవితంలో మధురమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఈ పెళ్లి తర్వాత రెండు వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను జీవితాంతం కలిసి ఉంటారు. అయితే ఇలా వివాహం చేసుకోవడానికి ముందు ఎవరికి కూడా విడిపోవాలనే అన్న ఆలోచనే రాదు. అందువల్లే పెళ్లి చేసుకునే ముందు వధువు,వరుడు అడిగి పెళ్లి చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే భవిష్యత్తులో ఏ జంట కూడా విడిపోవాలి అనుకోదు. అంతేకాకుండా భవిష్యత్తులో విడిపోవాలి అనుకుంటే ముందుగానే ఒప్పందం చేసుకుని దానిపై సంతకం చేస్తారా? వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంది కదూ.

అవును ఇది నిజమే ఇలాంటి ఒక దురదృష్టకర ఆలోచన ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ గా మారిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిసింది. ఇందులో సెలబ్రిటీలు తమ పెళ్లి చేసుకునే ముందు ఒక ఒప్పందం పై సంతకం చేసి భవిష్యత్తులో విడాకులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒప్పందం ప్రకారం షరతులను పాటిస్తామని పేర్కొన్నారు. ఇటువంటి ఒప్పందాలు చట్టబద్ధంగా కూడా నమోదు చేయబడ్డాయి.

అయితే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఒక హీరో మరో హీరోయిన్ మధ్య అలాంటి ఒప్పందం వెలుగులోకి వచ్చింది. వారు విడిపోయారు అనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆ యువ హీరో తన తండ్రి మరియు కథల నుండి వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను వారసత్వంగా సంపాదించాడు. కానీ ఆ హీరోయిన్ కి ఎక్కువ ఆస్తి లేదు. వీరి వివాహం సమయంలో ఒక అగ్ర న్యాయవాది రూపొందించిన ఒక ఒప్పందం పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో వారి విడిపోవాల్సి వస్తే ఏ ఒక్కరు కూడా భరణం కోసం కోర్టును ఆశ్రయించిన కూడడు అనేది ఒప్పందం.